Begin typing your search above and press return to search.
'ఓడియన్' బిజీలో 'మహాభారతం' డిలే!!
By: Tupaki Desk | 13 Oct 2018 5:31 AM1000 కోట్ల `మహాభారతం` ప్రారంభం అవుతుందా.. అవ్వదా? అంటే డౌటేనన్న మాట నిన్నటిరోజున వినిపించింది. మోహన్లాల్ - మీనన్ - బి.ఆర్.శెట్టి త్రయం వ్యవహారంపై రైటర్ వాసుదేవ మీనన్ సీరియస్ అయిన విధానం చూస్తే ఇక ఈ ప్రాజెక్టు కష్టమనంటూ పెదవి విరిచేశారు. `మహాభారతం`ను వెండితెరకెక్కించాలని ఎందరో కలగన్నారు. కానీ ఎవరి వల్లా కావడం లేదు. ఈ ప్రాజెక్టు ఆరంభ కష్టాలతోనే ఆగిపోతోంది. భారీ కాన్వాసు వల్ల ఆర్థిక వనరుల సమీకరణ అంత తేలిగ్గా కుదిరే పని కాదని, అందుకే మోహన్లాల్ ప్రాజెక్టు కష్టమేనన్న మాటా వినిపించింది.
నాలుగేళ్లయినా పని మొదలు పెట్టలేదు. ఇలా అయితే నా స్క్రిప్టు నాకు ఇచ్చేయండి! అంటూ రైటర్ వాసుదేవమీనన్ సీరియస్ అవ్వడంతో దీనిపై దర్శకుడు వి.ఏ.శ్రీకుమార్ మీనన్ స్పందించారు. ఆర్థికపరమైన సంక్లిష్టతల వల్లనే ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ సినిమాతో పాటు వేరొక సినిమాలోనూ పెట్టుబడులు పెట్టి ఉన్నాను. అది కూడా `ఓడియన్` లాంటి భారీ సినిమా కావడంతో చిక్కులొచ్చిపడ్డాయని తెలిపారు.
శ్రీకుమార్ మీనన్ ఫేస్బుక్లో స్పందిస్తూ -``అసలేం జరుగుతోందో వివరించేందుకు త్వరలోనే నాయర్ని కలుస్తాను. సాధ్యమైనంత తొందర్లోనే ఆయన్ని కలిసి `మహాభారతం` ప్రోగ్రెస్ గురించి వివరిస్తాను. ప్రస్తుతం ఓడియన్ ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉన్నాను. గత ఏడాదే ఈ సినిమాని ప్రారంభించాం. మహాభారతం చిత్రాన్ని గత ఏడాది అధికారికంగా ప్రకటించాం. ఇందులో మోహన్లాల్ భీముడిగా నటించనున్నారు. ఐదుగురు పాండవుల్లో రెండో వాడైన భీముడి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తున్నాం. ఇతర కాస్టింగ్ ఎంపికల గురించి ప్రకటిస్తాం`` అని తెలిపారు. మొత్తానికి 1000 కోట్ల `మహాభారతం`ను హోల్డ్లో ఉంచామని, త్వరలో ప్రారంభిస్తామని మాత్రం దర్శకుడు అంటున్నారు. కనీసం 2019 జూలైలో అయినా ఈ సినిమా ప్రారంభమవుతుందా? అంటూ రచయిత నాయర్ అతడి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
నాలుగేళ్లయినా పని మొదలు పెట్టలేదు. ఇలా అయితే నా స్క్రిప్టు నాకు ఇచ్చేయండి! అంటూ రైటర్ వాసుదేవమీనన్ సీరియస్ అవ్వడంతో దీనిపై దర్శకుడు వి.ఏ.శ్రీకుమార్ మీనన్ స్పందించారు. ఆర్థికపరమైన సంక్లిష్టతల వల్లనే ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ సినిమాతో పాటు వేరొక సినిమాలోనూ పెట్టుబడులు పెట్టి ఉన్నాను. అది కూడా `ఓడియన్` లాంటి భారీ సినిమా కావడంతో చిక్కులొచ్చిపడ్డాయని తెలిపారు.
శ్రీకుమార్ మీనన్ ఫేస్బుక్లో స్పందిస్తూ -``అసలేం జరుగుతోందో వివరించేందుకు త్వరలోనే నాయర్ని కలుస్తాను. సాధ్యమైనంత తొందర్లోనే ఆయన్ని కలిసి `మహాభారతం` ప్రోగ్రెస్ గురించి వివరిస్తాను. ప్రస్తుతం ఓడియన్ ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉన్నాను. గత ఏడాదే ఈ సినిమాని ప్రారంభించాం. మహాభారతం చిత్రాన్ని గత ఏడాది అధికారికంగా ప్రకటించాం. ఇందులో మోహన్లాల్ భీముడిగా నటించనున్నారు. ఐదుగురు పాండవుల్లో రెండో వాడైన భీముడి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తున్నాం. ఇతర కాస్టింగ్ ఎంపికల గురించి ప్రకటిస్తాం`` అని తెలిపారు. మొత్తానికి 1000 కోట్ల `మహాభారతం`ను హోల్డ్లో ఉంచామని, త్వరలో ప్రారంభిస్తామని మాత్రం దర్శకుడు అంటున్నారు. కనీసం 2019 జూలైలో అయినా ఈ సినిమా ప్రారంభమవుతుందా? అంటూ రచయిత నాయర్ అతడి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.