Begin typing your search above and press return to search.
'ఉప్పెన' ఎఫెక్ట్ తో 'జీఏ2' సినిమాలో మార్పులు
By: Tupaki Desk | 22 March 2021 3:30 AM GMTస్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. ఉప్పెన సినిమాకు సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ.. స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ పర్యవేక్షణ చేసినట్లుగా సమాచారం. సుకుమార్ దృష్టి పెట్టడం వల్లే ఉప్పెన సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యింది అనేది చాలా మంది మాట. ఉప్పెన సక్సెస్ నేపథ్యంలో జీఏ2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న '18 పేజెస్' సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇటీవలే బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో 18 పేజెస్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. సుకుమార్ గారు ఒక సారి చూడాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే 18 పేజెస్ సినిమా చూసిన సుకుమార్ పలు మార్పులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఎడిటింగ్ కూడా పూర్తి అయిన 18 పేజెస్ కోసం రీ ఎడిటింగ్ చేయడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ మళ్లీ చేయాలంటూ సూచించాడట. దాంతో దర్శకుడు సూర్య ప్రతాప్ ఆ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్ రీ షెడ్యూల్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సుకుమార్ మార్క్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై సుకుమార్.. అల్లు అరవింద్ లు అన్ని విధాలుగా సంతృప్తి చెందిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే ఎడిటింగ్ కూడా పూర్తి అయిన 18 పేజెస్ కోసం రీ ఎడిటింగ్ చేయడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ మళ్లీ చేయాలంటూ సూచించాడట. దాంతో దర్శకుడు సూర్య ప్రతాప్ ఆ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్ రీ షెడ్యూల్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సుకుమార్ మార్క్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై సుకుమార్.. అల్లు అరవింద్ లు అన్ని విధాలుగా సంతృప్తి చెందిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.