Begin typing your search above and press return to search.

కృతిశెట్టి పై ఫైర్ అయిన లింగుస్వామి..?

By:  Tupaki Desk   |   12 Aug 2021 2:30 AM GMT
కృతిశెట్టి పై ఫైర్ అయిన లింగుస్వామి..?
X
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఫస్ట్ మూవీతోనే యువ హృదయాలను కొల్లగొట్టిన కృతి.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం 'ఉస్తాద్' హీరో రామ్ పోతినేని - డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బైలింగ్విల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నదియా - నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

#RAPO19 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన షెడ్యూల్ షూట్ లో హీరోయిన్ కృతి శెట్టి పై దర్శకుడు లింగుస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం కృతిశెట్టి - నాజర్ పాల్గొనే ఎమోషనల్‌ సీన్స్ ని దర్శకుడు చిత్రీకరిస్తున్నారట. అయితే ఇందులో కృతి భావోద్వేగాలు పండించలేకపోయారంట.

దాదాపు గంటపాటు ఎన్నో రీటేకులు తీసుకున్నప్పటికీ కృతి ఎమోషన్ తీసుకురాకపోవడంతో.. ఒక్క సీన్‌ కూడా ఓకే కాలేదంట. దీంతో సీనియర్ నటుడు నాజర్‌ కాస్త అసహనానికి గురయ్యారట. ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ పై లింగుస్వామి ఫైర్ అయ్యారని అంటున్నారు. ఇది నిజమో కాదో ఖచ్చితంగా తెలియదు కానీ.. దీని గురించి నెట్టింట వార్తలు మాత్రం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే, ఫస్ట్ సినిమాలో ఎమోషన్స్ బాగా పండించిందని విమర్శకులు మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న కృతికి ఇప్పుడు ఏమైందని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.