Begin typing your search above and press return to search.

చరణ్ తరఫున ఉపాసన వెళ్లిందిలే

By:  Tupaki Desk   |   12 Dec 2016 6:09 AM GMT
చరణ్ తరఫున ఉపాసన వెళ్లిందిలే
X
అక్కినేని అఖిల్-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధ వేడుక తాజాగా పూర్తయిన విషయం అందరికీ తెలుసు. ఇరు కుటుంబాలు ఎన్నో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. సాధారణంగా ఇలాంటి సెలబ్రిటీ ఈవెంట్స్ మీడియా హంగామాతో ఉంటాయ్ కానీ.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ సారి ప్రైవేటు కార్యక్రమం మాదిరిగానే పూర్తి చేశారు.

అక్కినేని-జీవీకే కుటుంబ సభ్యులు అందరినీ ఈ ఎంగేజ్మెంట్ కు పిలిచినా.. సినిమా రంగం నుంచి అతి కొద్ది మందే హాజరయ్యారు. ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్ లో ఒక్కో ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరే ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ప్రభాస్.. నితిన్.. రానా.. మంచు లక్ష్మి.. ఇలా అన్నమాట. ఇక మెగా ఫ్యామిలీ నుంచి అయితే.. రామ్ చరణ్ భార్య ఉపాసన అఖిల్-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధంలో పాల్గొంది. అలంకరణ సమయంలో ఉపాసన-శ్రేయాలు కలిసి బోలెడంత హంగామా చేసేశారట.

ఈ ఎంగేజ్మెంట్ కు వచ్చిన సినిమావాళ్లంతా యంగ్ జనరేషన్ కావడం గమనించాలి. ప్రస్తుతం చరణ్ యూఎస్ టూర్ లో ఉండడంతో.. అతని తరఫున ఉపాసన అటెండ్ అయ్యి ఆ లోటు లేకుండా చేసిందన్న మాట.