Begin typing your search above and press return to search.

చెర్రీ -మహేష్ భార్యలు మళ్లీ కలిశారే

By:  Tupaki Desk   |   29 Jan 2017 12:25 PM IST
చెర్రీ -మహేష్ భార్యలు మళ్లీ కలిశారే
X
సూపర్ స్టార్ మహేష్ బాబు- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల విషయంలో ఒకట్రెండు సార్లు పోటీ పడ్డారు కానీ.. అదంతా ఆన్ స్క్రీన్ కే పరిమితం. కానీ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మంచి ఫ్రెండ్స్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

పర్సనల్ గా వీరిద్దరూ ఫ్రెండ్స్ అయితే.. మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్.. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా మంచి స్నేహితులైపోయారు. వరుసగా అకేషన్లలో కలిసి కనిపిస్తున్న ఈ స్టార్ వైవ్స్.. కెమేరాలకు పోజులు ఇవ్వడానికి కూడా ఏమాత్రం సంశయించడం లేదు. రీసెంట్ గా వీరిద్దరూ జీవీకే రెడ్డి మనవడు కేశవ్ -వీణాల ప్రీ వెడ్డింగ్ బాష్ లో కనిపించారు. పింకీ రెడ్డీ-జీవీ సంజయ్ ల కొడుకు కేశవ్ కాగా.. కల్పన-తెర చిన్నప్పరెడ్డిల కుమార్తె వీణ. ఈ వేడుకకు నమ్రత.. ఉపాసన హాజరు కాగా.. చాలాసేపు వీరిద్దరూ కలిసే సందడి చేయడం విశేషం. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం.. ఆ వేడుకలో హాట్ టాపిక్ అయింది కూడా. ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు.

గతంలో కూడా వీరు ఇలా కలిసిన సందర్భాలు ఉన్నాయి. న్యూ ఇయర్ వెకేషన్ కోసం మహేష్ అండ్ ఫ్యామిలీ వెళితే.. అక్కడ కూడా చెర్రీ అండ్ ఉపాసన సందడి చేశారు. రీసెంట్ నమ్రత బర్త్ డే వేడుకకు కూడా చెర్రీ-ఉపాసనలు హాజరయ్యారు. నెలరోజుల్లోపే 3 సార్లు కలిసి సందడి చేశారంటే.. మహేష్-చరణ్ ఫ్యామిలీల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/