Begin typing your search above and press return to search.

పాజిటివ్ అనగానే రాత్రంతా ఏడ్చిండట

By:  Tupaki Desk   |   2 July 2020 11:15 AM IST
పాజిటివ్ అనగానే రాత్రంతా ఏడ్చిండట
X
తెలుగు బుల్లి తెర నటి నవ్య స్వామి వైరస్ పాజిటివ్ అంటూ ఇటీవలే నిర్దారణ అయ్యింది. షూటింగ్ లో పాల్గొంటున్న నవ్యకు వైరస్ లక్షణాలు బయటపడటంతో వెంటనే హాస్పిటల్ కు వెళ్లగా డాక్టర్ సలహా మేరకు వైరస్ నిర్దారణ చేయించుకుందట. ఆ సమయంలో వైరస్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఇంటికే పరిమితం అయ్యిందట. ఆ రాత్రి అంతా కూడా నేను మరియు అమ్మ ఏడుస్తూనే ఉన్నామని నవ్య తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నా వల్ల ఇతరులు ఇబ్బంది పడ్డారని.. నా కారణంగా నా తోటి నటి నటులకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చిందేమో అని భయపడ్డాను. మొదటి రోజు నేను చాలా ఆందోళన చెందాను. ఆతర్వాత రోజు నుండి కాస్త కుడుటపడి జాగ్రత్తలు తీసుకుని రోగనిరోధక శక్తి ని పెంచుకున్నాను. ఇప్పుడు నాకు వైరస్ లక్షణాలు తగ్గాయి అంది.

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నవ్య ప్రస్తుతం ఆమె కథ.. నాపేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తోంది. మొదట నవ్య కు పాజిటివ్ అనే విషయం నిజం కాదని అనుకున్నారు. కానీ తాజాగా నవ్య స్వయంగా విషయాన్ని వెల్లడి చేసింది. ప్రస్తుతం తెలుగు బుల్లి తెర నటి నటులను వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు నటి నటులు ఇంకా సాంకేతిక నిపుణులు వైరస్ బారిన పడ్డట్లుగా సమాచారం అందుతోంది.