Begin typing your search above and press return to search.

బయోపిక్ స్కోరు పెరుగుతోంది

By:  Tupaki Desk   |   8 Nov 2017 4:09 AM GMT
బయోపిక్ స్కోరు పెరుగుతోంది
X
ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. సల్మాన్ ఖాన్ సుల్తాన్ - అమీర్ ఖాన్ దంగల్ సూపర్ హిట్లు కావడంతో బయోపిక్స్ మీద డైరెక్టర్లకు ఇంట్రస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే అన్ని రంగాల్లో విజేతలుగా నిలిచిన జీవిత గాథలను స్టడీ చేయడంలో మునిగిపోయారు. ఈ బయో పిక్ ట్రెండ్ టాలీవుడ్ కు కూడా వంటపట్టినట్టే అనిపిస్తోంది. కాకపోతే కాస్తంత డిఫరెంట్ గా వంటపట్టింది. అందరూ ఒక వ్యక్తి జీవితగాథ చుట్టూనే తిరుగుతున్నారు.

తెలుగుతేజం నందమూరి తారక రామారావు జీవిత గాథతో సినిమా తీస్తామని ఇప్పటికే ముగ్గురు అఫీషియల్ గానే ప్రకటించారు. తాజాగా మరో ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ పై సినిమా తీయడానికి రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ లోని లేటెస్ట్ న్యూస్. ఎన్టీఆర్ తనయుడు - హీరో బాలకృష్ణ లీడ్ రోల్ లో డైరెక్టర్ తేజ ఎన్టీఆర్ జీవితగాథ సినిమా తీయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయబోతున్నట్టు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేశాడు. కొద్దిరోజుల క్రితం కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రామ్ గోపాల్ వర్మ కాన్సెప్ట్ కు వ్యతిరేకంగా వీరగ్రంథం అనే సినిమా తీస్తానని ప్రకటించాడు. ఈ వ్యవహారాలన్నీ ఎటూ తేలకుండా అలాగే ఉన్నాతాజాగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అనే నిర్మాత కూడా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు.

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కొన్ని తమిళ సినిమాలు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన వ్యక్తి. ఇంతవరకు స్టార్ హీరోలతో సినిమాలేం చేయలేదు. మరి ఈయన సినిమా తీయాలని అనుకోవడమే తప్ప ఎవరిని లీడ్ క్యారెక్టర్లలో తీసుకుంటారు.. ఎన్టీఆర్ జీవితంలో ఏ ఎపిసోడ్లతో సినిమా తీస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద ఎన్టీఆర్ జీవితంతో బయోపిక్ లు తీయడానికి గట్టి పోటీయే ఉంది.