Begin typing your search above and press return to search.

అన్నీ తానై చూసుకుంటున్నా.. డైరెక్షన్ మాత్రం ఎందుకు చేయడం లేదో..!

By:  Tupaki Desk   |   17 Jan 2021 2:30 AM GMT
అన్నీ తానై చూసుకుంటున్నా.. డైరెక్షన్ మాత్రం ఎందుకు చేయడం లేదో..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సన్నిహితంగా ఉండే వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. 'జల్సా' 'అత్తారింటికి దారేది' సినిమాలు హిట్ అవగా.. పవన్ కెరీర్లో మైలురాయి సిల్వర్ జూబ్లీ చిత్రంగా వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ గా మిగిలిపోయింది.

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసిందని పవన్ ఫ్యాన్స్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్ - త్రివిక్రమ్ మళ్ళీ కలుస్తున్నారు. అయితే ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్ చేయకుండా కేవలం స్క్రీన్ ప్లే - డైలాగ్స్ మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి మార్పులు చేర్పులు మరియు డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ పవన్ దగ్గరకు చేరడానికి కారణం త్రివిక్రమ్.

అయితే దీనికి తెర వెనుక అంతా నడిపిస్తూ దర్శకత్వం మాత్రం చేయడం లేదు. పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయడానికి వెనకడుగు వేయడానికి 'అజ్ఞాతవాసి ఎఫెక్ట్ కారణమే టాక్ వినిపిస్తోంది. నిజానికి పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయాలనుకంటే అన్నింటికన్నా ముందు ఆయన సినిమానే వుంటుంది. మరి ఎందుకో త్రివిక్రమ్ పవన్ ని డైరెక్ట్ చేయకుండా అన్నీ తానై చూసుకుంటున్నాడు.