Begin typing your search above and press return to search.

'త్రివిక్రమ్ - ఎన్టీఆర్' మూవీ సబ్జెక్టు ఆ రేంజిలో ఉండబోతుందా..?

By:  Tupaki Desk   |   4 Aug 2020 2:30 AM GMT
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ సబ్జెక్టు ఆ రేంజిలో ఉండబోతుందా..?
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత' సినిమా తర్వాత రెండో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత బ్రేకులు లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల పై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్. 2021 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేయనున్నారట.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి వేరే ఇండస్ట్రీలలో ఈ స్టార్ హీరోకు మార్కెట్ ఏర్పడుతుంది. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా 30వది. కాబట్టి మరి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అవుతాడు కాబట్టి హీరోయిజంలో ఆ రేంజ్ అంచనాలు అభిమానులలో నెలకొంటాయి. అలాగే ఎంచుకునే సబ్జెక్టు కూడా పాన్ ఇండియా మెచ్చేలా ఉండాలి. అయితే త్రివిక్రమ్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజిలో ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. కనుక సబ్జెక్టు కూడా అన్నీ భాషల ప్రేక్షకుల అభిరుచికి నచ్చేలా ఉండాలని సినీవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడట. మరో విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా.. తెలుగులోనే రిలీజ్ అవుతుందా..? లేక పాన్ ఇండియా స్టార్ అవుతాడు గనక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.