Begin typing your search above and press return to search.
26/11 ముంబై దాడిలో అమరవీరుడికి నివాళి
By: Tupaki Desk | 25 Nov 2021 4:43 PM GMTఅడివి శేష్ నటిస్తున్న `మేజర్` పాన్ ఇండియా కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానుంది. ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై చూసే వీలుంది.
26/11 ముంబై దాడులలో ప్రాణాలను కోల్పోయిన ధైర్యవంతులను సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల సమక్షంలో స్మరించుకునే చిన్న సమావేశాన్ని తాజాగా అడివి శేష్ ఏర్పాటు చేశారు. K ఉన్నికృష్ణన్ - ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ ఈ సమావేశంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన కొడుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి తాజ్ మహల్ ప్యాలెస్ ని సందర్శించడానికి ముంబైకి వెళ్తారు.
ఈ సినిమా సమయంలో శేష్ .. మేజర్ సందీప్ తల్లిదండ్రుల మధ్య బంధం మరింత ఘాడంగా గొప్పగా మారింది. కాబట్టి తన తోటి దేశస్థులను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన భారతదేశపు కుమారుడిని గుర్తుచేసుకోవడానికి సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను శేష్ ఒక చిన్న సమావేశానికి ఆహ్వానించాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎవరికీ తెలియని కథను తెరపైకి తెస్తూ బహుభాషా చిత్రం `మేజర్`ని తెరకెక్కిస్తున్నారు. యుక్తవయస్సులోనే సైన్యంలో చేరి సంవత్సరాలు పని చేసిన అతను వీరమరణం పొందిన ముంబై దాడి విషాద సంఘటనల వరకు ధైర్యవంతుడి ప్రయాణాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ సమావేశంలో టీమ్ ముందుగా టీజర్ ను ఉప్పెనంటి భావోద్వేగాల నడుమ పంచుకున్నారు. విజువల్ గా అద్భుతమైన టీజర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి కథ-కథనం అందించారు.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. `మేజర్` 11 ఫిబ్రవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రం హిందీ- తెలుగు- మలయాళంలో విడుదల కానుంది.
26/11 ముంబై దాడులలో ప్రాణాలను కోల్పోయిన ధైర్యవంతులను సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల సమక్షంలో స్మరించుకునే చిన్న సమావేశాన్ని తాజాగా అడివి శేష్ ఏర్పాటు చేశారు. K ఉన్నికృష్ణన్ - ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ ఈ సమావేశంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన కొడుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి తాజ్ మహల్ ప్యాలెస్ ని సందర్శించడానికి ముంబైకి వెళ్తారు.
ఈ సినిమా సమయంలో శేష్ .. మేజర్ సందీప్ తల్లిదండ్రుల మధ్య బంధం మరింత ఘాడంగా గొప్పగా మారింది. కాబట్టి తన తోటి దేశస్థులను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన భారతదేశపు కుమారుడిని గుర్తుచేసుకోవడానికి సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను శేష్ ఒక చిన్న సమావేశానికి ఆహ్వానించాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎవరికీ తెలియని కథను తెరపైకి తెస్తూ బహుభాషా చిత్రం `మేజర్`ని తెరకెక్కిస్తున్నారు. యుక్తవయస్సులోనే సైన్యంలో చేరి సంవత్సరాలు పని చేసిన అతను వీరమరణం పొందిన ముంబై దాడి విషాద సంఘటనల వరకు ధైర్యవంతుడి ప్రయాణాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ సమావేశంలో టీమ్ ముందుగా టీజర్ ను ఉప్పెనంటి భావోద్వేగాల నడుమ పంచుకున్నారు. విజువల్ గా అద్భుతమైన టీజర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి కథ-కథనం అందించారు.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. `మేజర్` 11 ఫిబ్రవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రం హిందీ- తెలుగు- మలయాళంలో విడుదల కానుంది.