Begin typing your search above and press return to search.

EMK పూనకాల ఎపిసోడ్ ప్రోమో: హాట్ సీటుపై మహేష్ హోస్ట్ సీటుపై ఎన్టీఆర్..!

By:  Tupaki Desk   |   23 Nov 2021 9:30 AM GMT
EMK పూనకాల ఎపిసోడ్ ప్రోమో: హాట్ సీటుపై మహేష్ హోస్ట్ సీటుపై ఎన్టీఆర్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ మీద సందడి చేశారు. తారక్ హోస్టుగా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో కు సెలబ్రిటీ గెస్టుగా మహేష్ హాజరైన సంగతి తెలిసిందే. 'పూనకాల ఎపిసోడ్ లోడింగ్' అంటూ నిర్వాహకులు ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఎపిసోడ్ ఆఫ్ ది డికేడ్ గా చెబుతున్న ఈ ఎపిసోడ్ ప్రోమోను జెమినీ టీవీ తాజాగా విడుదల చేసింది.

'వెల్ కమ్ మహేష్ అన్నా..' అంటూ ఎన్టీఆర్ చప్పట్లతో సూపర్ స్టార్ ని ఆహ్వానించారు. 'అదిరిపోయింది' అని మహేష్ అంటుండగా.. 'నా రాజా' అంటూ తారక్ నవ్వేశారు. 'కరెక్ట్ ఆన్సర్ ని ఇటు తిప్పి అటు తిప్పి ఎందుకు' అని మహేష్ అంటే.. 'సరదా' అని యంగ్ టైగర్ బదులిచ్చారు. దీంతో నీకంటే మీ గురువు గారే బెటర్' గా ఉన్నారు' అని మహేష్ నవ్వడం వీక్షకులను అలరిస్తోంది. ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కాబోతున్నట్లు జెమినీ టీవీ పేర్కొంది.

మహేష్ - ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ షో లో స్టార్ హీరోలు గేమ్ ఆడుతూ ఎన్నో విషయాలు, అనుభూతులను పంచుకొన్నారని తెలుస్తోంది. సూపర్ స్టార్ - యంగ్ టైగర్ సందడి చేయబోతున్న EMK ఎపిసోడ్ కు బుల్లితెర మీద అత్యధిక టీఆర్పీ రేటింగ్ గ్యారంటీ అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తారక్ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానమిచ్చి మహేష్ ఈ షో లో ఎంత గెలుచుకున్నారో అని ఆలోచిస్తున్నారు.

కాగా, రామ్ చరణ్ గెస్టుగా హాజరైన ఎపిసోడ్ తో ప్రారంభమైన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఎపిసోడ్.. జనరంజకంగా బుల్లితెర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతోంది. సాధారణ ప్రేక్షకులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు ఈ షో లో సందడి చేశారు. సమంత - రాజమౌళి - కొరటాల శివ - దేవిశ్రీప్రసాద్ - థమన్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు స్పెషల్ గెస్టుగా హాజరై అలరించబోతున్నారు.