Begin typing your search above and press return to search.

రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు.. మ‌హేష్ బాబు సినిమా ‘మేజ‌ర్’ అనౌన్స్ మెంట్‌!

By:  Tupaki Desk   |   14 March 2021 10:10 AM GMT
రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు.. మ‌హేష్ బాబు సినిమా ‘మేజ‌ర్’ అనౌన్స్ మెంట్‌!
X
2006లో ముంబైలో పాకిస్తాన్ టెర్ర‌రిస్టులు సాగించిన ఉగ్ర‌దాడిని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌రిచిపోలేరు. 26/11గా పేరుగాంచిన ఈ దాడుల్లో ఎంతో మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. వారిని ర‌క్షించే క్ర‌మంలో పోలీసులు కూడా చాలా మంది అమ‌రుల‌య్యారు. అలాంటి వారిలో ఒక‌రు మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్.

ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘మేజర్’. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడవి శేషు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. క్షణం, గూఢచారి వంటి చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్న అడవి శేషు నుంచి ఈ సినిమా వస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి.

గూఢచారి సినిమా ఫేం శశికిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల‌, బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సూప‌ర్ మ‌హేష్ కు చెందిన బీఎంజీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తోపాటు సోనీ పిక్చ‌ర్స్‌, శ‌ర‌త్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే.. రేపు (మార్చి 15) ఉన్నికృష్ణ‌న్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా మేజ‌ర్ అనౌన్స్ మెంట్ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది యూనిట్‌. సాయంత్రం 4 గంట‌ల‌కు బిగ్ అప్డేట్ ఇస్తామ‌ని చెప్ప‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ సినిమాను వ‌చ్చే జూలై 2న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.