Begin typing your search above and press return to search.

పరువు నష్టం కేసు వేస్తున్న హీరో, డైరెక్టర్

By:  Tupaki Desk   |   14 July 2016 7:00 AM GMT
పరువు నష్టం కేసు వేస్తున్న హీరో, డైరెక్టర్
X
బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా వివాదాల పరిష్కరానికి లీగల్ రూట్ ని ఎంచుకోరు. ఆ ప్రాసెస్ లో అయ్యే లేట్ కారణంగా కమిట్ మెంట్స్ మిస్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే సామరస్యంగా పరిష్కారానికి ప్రయత్నిస్తారు. కానీ హీరో టైగర్ ష్రాఫ్.. దర్శకుడు సబ్బీర్ ఖాన్ లు మాత్రం ఓ వివాదం విషయంలో పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అవుతున్నారు.

కృతిక్ కుమార్ పాండే అనే ఔత్సాహిక ఫిలిం మేకర్.. ఈ మధ్య వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఓ కంప్లెయిట్ చేశాడు. టైగర్ ష్రాఫ్ - సబ్బీర్ ఖాన్ లు తెరకెక్కించనున్న 'మున్నా మైకేల్' చిత్రం తన స్టోరీ లైన్ అన్నది కృతిక్ చేసిన ఫిర్యాదు. ఓ ఏడాది క్రితం తాను టైగర్ ష్రాఫ్ ను కలిసి ఓ స్టోరీ చెప్పానని.. ఈ ప్రాజెక్ట్ చేద్దామంటూ తనను తిప్పుకున్న టైగర్ ష్రాఫ్.. ఇప్పుడు అదే తరహా స్టోరీ లైన్ తో సబ్బీర్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని ఫిర్యాదులో తెలిపాడు. 'ఎంజీ రిటర్న్' పేరుతో తాను సినిమా తీద్దామని అనుకుంటే.. ఇప్పుడు వీళ్లిద్దరూ మోసం చేశారని చెప్పాడు కృతిక్.

అయితే అసలు కృతిక్ కుమార్ పాండే అనే వ్యక్తి ఎవరో తమకు తెలీదని.. కేవలం పబ్లిసిటీ కోసం తమ పరువు తీసేందుకు అతడు సిద్ధమయ్యాడన్నది టైగర్ ష్రాఫ్.. సబ్బీర్ ఖాన్ ల వెర్షన్. ఇలాంటి వాటిని నిలువరించాలంటే.. లీగల్ గా చర్యలు తీసుకోవడం తప్పని సరి అని భావించండంతో.. పరువు నష్టం దావా వేసేందుకు లాయర్లతో చర్చిస్తున్నారు.