Begin typing your search above and press return to search.

నా ప్రాణాలకు ముప్పు: హీరోపై సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   15 July 2021 9:22 AM GMT
నా ప్రాణాలకు ముప్పు: హీరోపై సంచలన ఆరోపణలు
X
బాలీవుడ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గ్యాంగ్ రేప్ కేసులో నటుడు జాకీ భగ్నానీ మెడకు ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది. మోడల్ అపర్ణా తనను రేప్ చేశారంటూ హీరో జాకీ భగ్నానీతోపాటు ఏడుగురిపై రేప్ కేసు పెట్టింది. మే 26వ తేదీన జాకీ భగ్నానీతోపాటు వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అపర్ణ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

మోడల్ అపర్ణ ఫిర్యాదు మేరకు బంద్రా పోలీసులు ఆమెను సామూహిక అత్యాచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. తొమ్మిది మందలో ప్రముఖులైన హీరో జాకీ భగ్నానీతోపాటు టీ సిరీస్ అధినేత కృష్ణన్ కుమార్, నిఖిల్ కామత్, షీల్ గుప్తా, అజిత్ థాకూర్, గుర్జోత్ సింగ్, విష్ణు ఇందూరి, అనిర్బన్ బ్లా తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అపర్ణ సంచలన పోస్టు చేసింది. గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన తర్వాత నిందితులు నన్ను బెదిరిస్తున్నారని అపర్ణ ఇన్ స్టాగ్రామ్ లో సంచలన పోస్టు పెట్టింది. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారంది. చెప్పడానికి వీలు లేకుండా ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారని.. నేను వందలాది మందిని ఫోన్ లో బ్లాక్ చేశానని తెలిపింది. అయినా విడవకుండా ఫేక్ అకౌంట్లతో వేదిస్తున్నారని ఇన్ స్టాగ్రామ్ లో అపర్ణ వాపోయింది.

ఫేక్ అకౌంట్ల ద్వారా బూతు చిత్రాలు, సెక్స్ వీడియోలు పంపిస్తున్నారని అపర్ణ ఇన్ స్టాగ్రామ్ లో ఆవేదన వ్యక్తం చేసింది. నేను పోలీసులకు ఫిర్యాదులు చేసి అలసిపోయానని.. తిరిగే ఓపిక, సహనం లేదంది. నా ప్రాణాలకు ముప్పు ఉందని.. నాకు ఏమైనా జరిగితే కారణం గుర్ ప్రీత్ సింగ్, షీల్ గుప్తా, నిఖిల్ కామత్, గుర్జోత్ సింగ్, అజిత్ థాకూర్, కృష్ణన్ కుమార్, విష్ణు ఇందూరి, జాకీ భగ్నానీలేనని అపర్ణ తన పోస్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది.

నా జీవితంతో ఆడుకుంటూ మానసికంగా, శారీరకంగా హింసించారని.. కేసును తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని.. పోలీసులను తమ పరపతి, డబ్బుతో కొనాలని చూస్తున్నారని అపర్ణ పోస్టులో పేర్కొంది. అపర్ణ చేసిన పోస్టు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనమైంది.