Begin typing your search above and press return to search.

సర్కారు వారి ట్రైలర్ పై ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇదే..!!

By:  Tupaki Desk   |   3 May 2022 7:32 AM GMT
సర్కారు వారి ట్రైలర్ పై ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇదే..!!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎగ్జైటింగ్ గా వేచి చూసిన ట్రైలర్ కూడా వచ్చేసింది.

హై వోల్టేజ్ మాస్ & యాక్షన్ బ్లాక్స్ - లవ్ - కామెడీ - ఎమోషన్.. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మాస్ డైలాగ్స్ - గ్రాండ్ విజువల్స్ - అద్భుతమైన బీజీఎంతో కూడిన SVP ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

'సర్కారు వారి పాట' ట్రైలర్ సూపర్ స్టార్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. మహేష్ బాబు స్టైలిష్ అవతార్‌ లో కనిపించి.. మెంటల్ మాస్ స్వాగ్ తో కనువిందు చేశారు. 'బిజినెస్‌ మ్యాన్' 'పోకిరి' తరహాలో మహేష్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే సర్కారు వారి ట్రైలర్ లో వింటేజ్ మహేష్ కనిపించారని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అలానే హీరోయిన్ కీర్తి సురేష్ తన క్యూట్ లుక్స్‌ తో అందరినీ ఆకట్టుకుంది. మహేష్ - కీర్తి జోడి లవ్లీగా వుంది.

టెక్నికల్ గా 'సర్కారు వారి పాట' అత్యన్నత స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఎస్ థమన్ ట్రైలర్ కోసం కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ గ్రాండ్ గా ఉంది. సినిమాటోగ్రాఫర్ మది విజువల్స్.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వున్నాయి.

SVP ట్రైలర్ లో మహేష్ బాబు చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే డైలాగ్ తో ఓ వర్గం సినీ అభిమానులను.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి - వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ అదే డైలాగ్ ను తన సినిమాలో వాడినందుకు.. పవన్ అభిమానులు - జనసేన కార్యకర్తలు SVP చిత్రానికి దూరంగా ఉండే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏదేమైనా 'సర్కారు వారి పాట' సినిమా మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. అలానే ఇదొక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని సూచించింది. ఇకపోతే నెట్టింట ఈ ట్రైలర్ మునుపటి రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభించింది..

కేవలం 29 నిమిషాల్లో 5 మిలియన్ లకు పైగా వ్యూస్ రాబట్టి.. వేగంగా ఈ ఘనత సాధించిన ట్రైలర్ గా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 15 మిలియన్ వ్యూస్ - ఫాస్టెస్ట్ 900K లైక్స్ అందుకున్న ట్రైలర్ గా నిలిచింది.

ఇదే క్రమంలో 'సర్కార్ వారి పాట' థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌ లో ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ మరియు 1.1 మిలియన్ లైక్స్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ 2.36 నిమిషాల నిడివి గల వీడియో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

'సర్కారు వారి..' చిత్రానికి పరశురాం పెట్లా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు.