Begin typing your search above and press return to search.

ఎం జరిగిందో మరి చెయ్యడం లేదు అనేసింది

By:  Tupaki Desk   |   1 April 2020 5:30 AM GMT
ఎం జరిగిందో మరి చెయ్యడం లేదు అనేసింది
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్న నటి పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిన ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈమె డేట్స్ కోసం హీరోలు సైతం వెయిట్ చేసే రేంజ్ ఈ బ్యూటీది. రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే తమిళంలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు సూర్య సరసన యముడు దర్శకుడు హరితో కలిసి నటించనుందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ట్విట్టర్ వేదికగా స్పందించిన పూజా.. నేను తమిళ సినిమాల్లో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడప్పుడే నేను తమిళ సినిమాల్లో నటించబోవడం లేదు. కానీ కొన్ని స్క్రిప్టులు విన్నాను, వాటిల్లో ఇంకా ఏదీ ఫైనలైజ్ అవలేదు. ఫైనల్ అవగానే నేనే మీకు చెప్తాను అప్పటి వరకు ఎలాంటి వార్తలని మీరు నమ్మకండి. కాకపోతే ఈ సంవత్సరం ఖచ్చితంగా తమిళ చిత్రంలో నటిస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తెలుగు, హిందీల్లో బిజీగా మారిన పూజా హెగ్డే కొలీవుడ్ లో కూడా నటించనుంది. వాస్తవానికి పూజా హెగ్డే మొదటగా వెండితెరకి పరిచయం అయ్యింది తమిళ సినిమాతోనే. జీవా హీరోగా వచ్చిన మూగముడి (తెలుగు 'మాస్క్') చిత్రంతో పరిచయమైన ఆమెకి ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో అక్కడ అవకాశాలు రాలేదు. తెలుగులో మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలు ఆమెని స్టార్ హీరోయిన్ ని చేశాయి. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న పూజా కోలీవుడ్ లో కూడా పాగా వేస్తుందేమో చూడాలి.