Begin typing your search above and press return to search.

టికెట్స్ లేవంటూ.. రౌడీ రత్నం కోసం 'జాతిరత్నాలు' స్పెషల్ షో..!

By:  Tupaki Desk   |   15 March 2021 4:01 PM GMT
టికెట్స్ లేవంటూ.. రౌడీ రత్నం కోసం జాతిరత్నాలు స్పెషల్ షో..!
X
నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ''జాతిరత్నాలు'' సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తూ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో వసూళ్ళు స్టార్ట్ చేసిన ఈ సినిమా వీకెండ్ లో కూడా డామినేషన్ చూపించింది. తొలి రోజుకు దీటుగా త‌ర్వాతి రోజుల్లో క‌లెక్ష‌న్లు వస్తుండటం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో వీకెండ్ లో చాలా చోట్ల సినిమా హౌస్ ఫుల్స్‌ తో న‌డిచింది. ఆదివారం అయితే ఈ సినిమాకు ఎక్క‌డా టికెట్లు దొరికే ప‌రిస్థితి కనిపించలేదు. ఈ నేప‌థ్యంలో హౌస్ ఫుల్ బోర్డుల‌ను సూచిస్తూ చిత్ర బృందం ఒక ఫన్నీ పోస్ట‌ర్ కూడా వ‌దిలింది. 'చింత‌కాయ ర‌సం.. మా ప్రేక్ష‌కులు ఆవ్ సమ్' అంటూ ఫ‌న్నీ క్యాప్ష‌న్‌ తో పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ''నిజం చెప్పాలంటే మా ద‌గ్గ‌ర కూడా టికెట్లు లేవు'' అంటూ రైట‌ప్ జోడించింది. ఆ రేంజ్ లో ఈ సినిమా వసూళ్ళు ఉన్నాయని నిర్మాతలు చెప్పకనే చెప్తున్నారు.

ఇదిలావుండగా ఉండగా 'జాతిరత్నాలు' సినిమాకి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మొదటి నుంచీ సపోర్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్ - హీరో నవీన్ పోలిశెట్టి స్నేహితుడైన వీడీ.. ఈ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి అండగా నిలిచాడు. ఈ నేపథ్యంలో విజయ్ కోసం చిత్ర యూనిట్ స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. విజయ్ తో పాటు తన తల్లి మరియు తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాని చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''పాండమిక్ తర్వాత ఇంతమంచి సినిమా రావడం.. థియేటర్లకు రావడానికి భయపడుతున్న వారు కూడా సినిమా చూడటానికి బయటకి రావడం జరిగింది. సినిమా చూసి నేను ఫుల్ గా నవ్వుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ నా అభినందనలు'' అన్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనుదీప్ కేవీ విజయ్ కి థ్యాంక్స్ చెప్తూ.. 'అన్నంలో పెరుగులేదు.. విజయ్ కి తిరుగులేదు' అంటూ తనదైన శైలిలో నవ్వించాడు.