Begin typing your search above and press return to search.
మెగా అప్డేట్: '#Chiru153' షూటింగ్ స్టార్ట్ చేస్తున్న మెగాస్టార్..!
By: Tupaki Desk | 12 Aug 2021 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. ఇది చిరు కెరీర్ లో రాబోతున్న 153వ చిత్రం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి, తాజాగా ఓ మెగా అప్డేట్ ని మేకర్స్ అందించారు. '#Chiru153' మూవీ షూటింగ్ రేపు (ఆగస్టు 13) శుక్రవారం ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. అలానే ఓ మెగా సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయిందని తెలిపారు.
ఈ సందర్భంగా #Chiru153 మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సోషల్ మీడియాలో చిరంజీవి - మోహన్ రాజా లతో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ''జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. మేము #చిరు153 కోసం మొదటి పాటను పూర్తి చేసాము. మా ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారి నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు అందుకున్నాము. ఒక పెద్ద ఫ్యాన్ బాయ్ గా ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. మోహన్ రాజాకు ధన్యవాదాలు. రేపు షూటింగ్ ప్రారంభమవుతుంది'' అని తమన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, చిరంజీవి 153వ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్.బి. చౌదరి - ఎన్.వి.ప్రసాద్ - పరాస్ జైన్ మరియు వాకాడ అప్పారావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు రేపు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా #Chiru153 మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సోషల్ మీడియాలో చిరంజీవి - మోహన్ రాజా లతో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ''జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. మేము #చిరు153 కోసం మొదటి పాటను పూర్తి చేసాము. మా ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారి నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు అందుకున్నాము. ఒక పెద్ద ఫ్యాన్ బాయ్ గా ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. మోహన్ రాజాకు ధన్యవాదాలు. రేపు షూటింగ్ ప్రారంభమవుతుంది'' అని తమన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, చిరంజీవి 153వ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్.బి. చౌదరి - ఎన్.వి.ప్రసాద్ - పరాస్ జైన్ మరియు వాకాడ అప్పారావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు రేపు వెల్లడించే అవకాశం ఉంది.