Begin typing your search above and press return to search.
అమెరికా అంతరిక్ష యాత్రలో తెలుగు యువతి.. సంబరాల్లో బండ్ల గణేష్!
By: Tupaki Desk | 2 July 2021 8:50 PM ISTఅమెరికాకు చెందిన 'వర్జిన్ గెలాక్టిక్' అనే సంస్థ.. అంతరిక్ష యాత్రను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో ఓ తెలుగు యువతి కూడా ఉంది. భారత సంతతికి చెందిన ఆ యువతిపేరు శిరీష బండ్ల. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. ఈ స్పేస్ టూర్ లో పాల్గొంటున్నారు.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ టూర్ ప్లాన్ చేసింది. స్పేస్ లోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఈ కంపెనీ లైసెన్స్ కూడా తీసుకుంది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీకి జూన్ 25వ తేదీనే.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అనుమతి మంజూరు చేశారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే.. ప్రయాణికులను తీసుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి.
ఈ టీమ్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు కాగా.. మరో ముగ్గురు స్పేస్ సెషలిస్టులు. మిగిలిన ఒకరు బిలియనీర్. ఈ ఆరుగురు ఎవరంటే.. శిరీష బండ్ల, కెల్లి ల్యాటిమర్, స్టర్ కోవ్, డేవ్ మెక్ కే, మైఖేల్ మసూక్కీ, బ్రాస్నన్. వీరిలో బ్రాస్నన్ సంపన్నుడి హోదాలో నింగిలోకి ఎగరబోతున్నారు. ఈ యాత్ర పూర్తయితే.. తొలిసారి స్పేస్ లోకి వెళ్లివచ్చిన ప్రైవేటు వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు.
ఈ టీమ్ లో ఉన్న శిరీష బండ్ల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి. ఆమె కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ విధంగా ఈ స్పేస్ టూర్ కు వెళ్లే అవకాశం దక్కింది. దీంతో.. తెలుగువారంతా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ''శిరీష బండ్ల అంతరిక్షంలో వెళ్తుండడం ఎంతో గర్వంగా ఉంది'' అని ట్వీట్ చేశారు. దీంతో.. ఆ శిరీష కుటుంబానికీ, బండ్ల గణేష్ కు ఉన్న రిలేషన్ ఏంటని ఆరాతీస్తున్నారు. ఒకే ఇంటి పేరు ఉంది కాబట్టి ట్వీట్ చేశారా? నిజంగానే రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉందా? అని చర్చించుకుంటున్నారు.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ టూర్ ప్లాన్ చేసింది. స్పేస్ లోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఈ కంపెనీ లైసెన్స్ కూడా తీసుకుంది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీకి జూన్ 25వ తేదీనే.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అనుమతి మంజూరు చేశారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే.. ప్రయాణికులను తీసుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి.
ఈ టీమ్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు కాగా.. మరో ముగ్గురు స్పేస్ సెషలిస్టులు. మిగిలిన ఒకరు బిలియనీర్. ఈ ఆరుగురు ఎవరంటే.. శిరీష బండ్ల, కెల్లి ల్యాటిమర్, స్టర్ కోవ్, డేవ్ మెక్ కే, మైఖేల్ మసూక్కీ, బ్రాస్నన్. వీరిలో బ్రాస్నన్ సంపన్నుడి హోదాలో నింగిలోకి ఎగరబోతున్నారు. ఈ యాత్ర పూర్తయితే.. తొలిసారి స్పేస్ లోకి వెళ్లివచ్చిన ప్రైవేటు వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు.
ఈ టీమ్ లో ఉన్న శిరీష బండ్ల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి. ఆమె కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ విధంగా ఈ స్పేస్ టూర్ కు వెళ్లే అవకాశం దక్కింది. దీంతో.. తెలుగువారంతా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ''శిరీష బండ్ల అంతరిక్షంలో వెళ్తుండడం ఎంతో గర్వంగా ఉంది'' అని ట్వీట్ చేశారు. దీంతో.. ఆ శిరీష కుటుంబానికీ, బండ్ల గణేష్ కు ఉన్న రిలేషన్ ఏంటని ఆరాతీస్తున్నారు. ఒకే ఇంటి పేరు ఉంది కాబట్టి ట్వీట్ చేశారా? నిజంగానే రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉందా? అని చర్చించుకుంటున్నారు.
