Begin typing your search above and press return to search.

ఆ ఇండస్ట్రీకి వెళ్తే అత్యాచారం చేస్తారట..!

By:  Tupaki Desk   |   8 Aug 2020 12:30 AM GMT
ఆ ఇండస్ట్రీకి వెళ్తే అత్యాచారం చేస్తారట..!
X
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ సరసన నటించిన 'లెజెండ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఇండస్ట్రీలో రాధికా రూటే సపరేట్ అన్నట్లుగా అమ్మడు ముందుకు సాగుతుంది. ఏ ఇండస్ట్రీ అయినా అమ్మడికి అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా తానేంటో నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంది. అయితే ఇండస్ట్రీలో ముక్కుసూటిగా.. నిర్మొహమాటంగా మాట్లాడే హీరోయిన్లలో రాధికా ఒకరు. ఆమెకు ఏది అనిపించినా వెంటనే చెప్పేస్తుంది. ఇండస్ట్రీలో మరోసారి రాధికా ఆప్టే చర్చకు తెరలేపింది. ఆమె నటించిన బోల్డ్ సినిమాల సన్నివేశాలు లీక్ కావడం కొత్తేమీ కాదు. గతంలో రాధికా ఆప్టే నటించిన ''ద వెడ్డింగ్ గెస్ట్'' అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలో.. ఆ సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ లీకై నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదివరకే ఇండస్ట్రీ వ్యవహారం పై రాధికా తీవ్రస్థాయిలో మండిపడింది.

సమాజంలో సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫైర్ అయ్యింది. అప్పట్లో లీకైన సీన్‌లో తనతో పాటు హీరో కూడా ఉన్నాడని.. అతనిని వదిలిపెట్టి తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. తాజాగా అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చింది. కానీ ఆ వ్యాఖ్యలు తనవి కావని మరో షాక్ ఇచ్చింది. అయితే బాలీవుడ్ పై ఇటీవల "ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించేందుకు పుణె నుంచి ముంబై వచ్చేయాలని డిసైడ్ అయినప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్లు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారట. చాలామంది తనతో బాలీవుడ్ ఇండస్ట్రీ మంచిది కాదని చెప్పారని.. అలాగే అక్కడికి వెళ్తే నిన్ను అత్యాచారం చేస్తారని చెప్పినట్లు" రాధిక తెలిపింది. అయితే కొసమెరుపుగా సినీ ఇండస్ట్రీ పై జనాల అభిప్రాయాలు ఇలా ఉన్నాయని సర్దిచెప్పుకొచ్చింది. రాధికా మాటలు విన్న అందరూ ఖంగుతిన్నారట. ఈ అమ్మడు ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్ తీసే పనిలో ఉన్నట్లు సమాచారం.