Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాట లో కీర్తి సురేష్‌ వయోలిన్ ప్లే

By:  Tupaki Desk   |   10 Nov 2021 9:38 AM GMT
సర్కారు వారి పాట లో కీర్తి సురేష్‌ వయోలిన్ ప్లే
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. చివరి షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో ఇటీవలే ప్రారంభించారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో మహేష్‌ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. మల్టీ ట్యాలెంట్ అంటూ కీర్తి సురేష్‌ నిరూపించుకునేందుకు నటించడంతో పాటు తన డబ్బింగ్‌ తానే చెప్పుకోవడం ఇంకా తనకు ఇష్టమైన వయోలిన్‌ ను చాలా చక్కగా వాయించగలదు. అద్బుతమైన మ్యూజీషియన్‌ కీర్తి సురేష్ అంటూ ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. ఆమె పలు వయోలిన్ వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ తో ఒక పాట పాడించవచ్చు కదా అంటూ చాలా మంది అభిమానులు థమన్‌ ను అడుగుతున్నాడట. హీరోలతో పాటలు పాడించడంలో థమన్‌ స్పెషలిస్ట్‌. అందుకే హీరోయిన్‌ కీర్తి సురేష్ తో కూడా పాట పాడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అభిమానుల కోరిక ఇప్పుడు నెరవేరడం లేదు. కాని థమన్‌ చాలా ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్‌ పాట పాడుతుందా అంటూ ఒక వ్యక్తి ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నకు గాను థమన్ సమాధానంగా పాట అయితే పాడటం లేదు కాని వయోలిన్ వాయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కీర్తి సురేష్‌ వయోలిన్‌ ను అభిమానులు చూడబోతున్నట్లుగా చెప్పకనే చెప్పాడు.

మహేష్‌ బాబు సర్కారు వారి పాట నుండి ఇప్పటికే కీర్తి సురేష్‌ లుక్ విడుదల అయ్యింది. చాలా క్యూట్ గా ఆకట్టుకునే విధంగా ఆమె లుక్ ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్‌ ల కాంబినేషన్‌ చాలా క్యూట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రీకరణ డిసెంబర్‌ వరకు పూర్తి చేస్తారని తెలుస్తోంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నా కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వల్ల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. సమ్మర్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కథను దర్శకుడు పరశురామ్‌ చాలా ఎంటర్‌ టైన్‌మెంట్‌ స్క్రీన్‌ ప్లేతో తెరకెక్కిస్తున్నాడు.