Begin typing your search above and press return to search.

#సుశాంత్ .. పెట్ డాగ్స్ కోసం ఫాం హౌస్ కొనాల‌నుకున్నాడు!

By:  Tupaki Desk   |   8 Sep 2020 12:30 AM GMT
#సుశాంత్ .. పెట్ డాగ్స్ కోసం ఫాం హౌస్ కొనాల‌నుకున్నాడు!
X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నప్పుడు ర‌క‌ర‌కాల అంశాలు సినిమాటిక్ గా ట్విస్టుల‌తో సాగిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. సుశాంత్ తన మూడు పెంపుడు కుక్కలపై చూపించిన ప్రేమ చూస్తుంటే ఇంకేదో సందేహం క‌లుగుతోంది.

సుశాంత్ ముంబై శివార్లలో ఒక ఫామ్ ‌హౌస్ ని అద్దెకు తీసుకున్నాడు. అతనికి అమర్- అక్బర్ - ఆంథోనీ అనే మూడు పెట్ డాగ్స్ ఉన్నాయి. తన మరణానికి ఒక రోజు ముందు తన పెంపుడు జంతువుల నిర్వహణ కోసం నిధులను బదిలీ చేసినట్లు ఫామ్ హౌస్ సంరక్షకుడు ఇటీవల వెల్లడించాడు. సుశాంత్ తన ఖాతాలో డబ్బు జమ చేసినట్లు రీస్ వెల్లడించాడు.

రీస్ స‌మాచారం ప్రకారం.. సుశాంత్ ఫామ్ ‌హౌస్ ని కొనాలనుకున్నాడు. అక్కడికి శాశ్వతంగా వెళ్లాలని అనుకున్నాడు. తన పుట్టినరోజును శ్రుతి మోడీ- శామ్యూల్ మిరాండాతో కలిసి జరుపుకునేందుకు రియా చక్రవర్తితో కలిసి జనవరిలో ఫాంహౌస్ ని సందర్శించారు. సుశాంత్ కూడా మార్చిలో ఫామ్ హౌస్ ‌ను సందర్శించాలని యోచిస్తున్నప్పటికీ అది వాయిదా పడిందని తెలిసింది. ఇక పెట్ డాగ్స్ పై సుశాంత్ అవిభాజ్య ప్రేమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.