Begin typing your search above and press return to search.

సుశాంత్‌ తో పాటు రియాకీ ఆ అలవాటు

By:  Tupaki Desk   |   3 Sept 2020 10:00 PM IST
సుశాంత్‌ తో పాటు రియాకీ ఆ అలవాటు
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పూత్‌ మృతి నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్‌ మృతికి ఆమె కారణం అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈసమయంలో సీబీఐ ఎంక్వౌరీ కూడా జరుగుతోంది. ఆమె కేంద్రం గానే ఈ విచారణ జరుగుతున్నట్లగా తెలుస్తోంది. సుశాంత్‌ కుటుంబ సభ్యులు రియానే ప్రధాన దోషి అన్నట్లగా ఆరోపణలు చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు సీబీఐ వారు రియాను ఎంక్వౌరీ చేశారు.

ఆ సమయంలో సుశాంత్‌ తాను పరిచయం కాకముందు నుండే గంజాయి తాగేవాడంటూ పేర్కొంది. తాను అతడితో గంజాయి మాన్పించేందుకు తాను చాలా ప్రయత్నాలు చేసినట్లుగా రియా పేర్కొంది. కాని సుశాంత్‌ మాత్రం మానలేదని రియా చెప్పిందట. అదే సీబీఐ ఎంక్వౌరీలో సుశాంత్‌ మేనేజర్‌ శృతి మోదీ మాత్రం సుశాంత్‌ తో పాటు రియాకు కూడా డ్రగ్స్‌ అలవాటు ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

సుశాంత్‌.. రియా.. ఇంకా రియా సోదరుడు అంతా కలిసి టెర్రస్‌ పై గంజాయి తాగేవారంటూ శృతి పేర్కొన్నారు. ఈ విషయంలో రియా మరియు శృతిలు విభిన్నమైన విషయాలను చెప్పడంతో సీబీఐ వారు మరింత లోతుగా ఈ విషయాన్ని ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఇంకా పలువురు ప్రముఖులను కూడా ఎంక్వౌరీ చేసే అవకాశం ఉంది. నేడు రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్‌ సీబీఐ ముందు విచారణకు హాజరు అయ్యారు.