Begin typing your search above and press return to search.

అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సూపర్ స్టార్...!

By:  Tupaki Desk   |   9 May 2020 10:30 AM GMT
అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సూపర్ స్టార్...!
X
టాలీవుడ్ స్టార్ హీరోలలో పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబే అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటుంటారు. 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని'.. 'క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' అని ఆలోచిస్తుంటాడని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతుంటారు. హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఇతర వ్యాపారాలపై ద్రుష్టి పెట్టాడు మహేష్. బిజినెస్ మ్యాన్ గా మరి ఇతర వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. హంబుల్.కో ద్వారా టెక్సటైల్ బిజినెస్ లోకి దిగాడు. అలానే ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌ ఓపెన్ చేసిన థియేటర్స్ చైన్ సిస్టమ్ లోకి దిగాడు. అంతేకాకుండా ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మూవీ ప్రొడక్షన్స్ లోకి కూడా దిగాడు. ఆయన నటించే ప్రతి సినిమాలోనూ భాగస్వామిగా వ్యవహరిస్తూ హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

అయితే ఇప్పటి దాకా తాను నటించే సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిన మహేష్ ఇప్పుడు బయట హీరోలతో కూడా సినిమాలను తీయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అడవి శేష్ హీరోగా నటిస్తున్న 'మేజర్' సినిమాని సోనీ పిక్చ‌ర్స్‌ మరియు ఎప్ల‌స్ఎస్ మూవీస్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు సూపర్ స్టార్. 2008లో 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండతో ఒక సినిమాను మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంభందించిన చర్చలు కూడా జరిగాయట. మహేష్ ఏ పని చేసినా అండగా నిలబడే తన ఫాన్స్ ఈ డెసిషన్ కి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారని మహేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇది పక్కన పెడితే మహేష్ ఈ రెండు సినిమాలతో పాటు తమిళ హీరో కార్తీ తో ఒక బైలింగ్వల్ మూవీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి రానున్న రోజుల్లో ఏం అవుతుందో చూడాలి. మొత్తం మీద అటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా ఫుల్ స్వింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. అదే జోష్ లో తన కెరీర్లో 27వ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం.