Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత 'మర్యాద రామన్న' కాంబో రిపీట్‌

By:  Tupaki Desk   |   26 Nov 2020 11:50 AM GMT
పదేళ్ల తర్వాత మర్యాద రామన్న కాంబో రిపీట్‌
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమా వచ్చి పదేళ్లు అయ్యింది. ఆ సినిమాలో జంటగా నటించిన సునీల్‌ మరియు సలోనీల కెరీర్‌ లు ప్రస్తుతం చాలా నీరసంగా ఉన్నాయి. సలోనిని జనాలు మరిచి పోయే పరిస్థితి వచ్చింది. సునీల్‌ కమెడియన్‌ గా సినిమాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్‌ అవ్వడం లేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరిని వీఎన్‌ ఆధిత్య కలిపేందుకు ముందుకు వచ్చాడు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సునీల్‌ హీరోగా వీఎన్‌ ఆధిత్య దర్శకత్వంలో ఒక సినిమా మొదలు అయిన విషయం తెల్సిందే.

సైలెంట్‌ గా సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వకుండానే షూటింగ్‌ ను చకచక జరుపుతున్నారు. ఈ సినిమాలో సునీల్‌ కు జోడీగా సలోనిని నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిది హిట్‌ పెయిర్‌ అవ్వడంతో పాటు హీరోయిన్‌ పాత్రకు ఆమె అయితే బాగుంటుందనే అభిప్రాయంతో దర్శకుడు ఆధిత్య ఆమెను ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్ట్‌ గా ఓటీటీలో విడుదల చేసే యోచనలో ఉన్నట్లుగా ఇంతకు ముందు వార్తలు వచ్చాయి.

థియేటర్లు ఓపెన్‌ అవుతున్న కారణంగా ఓటీటీ విడుదల నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందనిపిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరికి కూడా ఈ సినిమా చాలా చాలా కీలకం. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆధిత్య వీరికి మంచి హిట్‌ ను ఇచ్చేనా చూడాలి.