Begin typing your search above and press return to search.

శ్రుతిహాస‌న్ తో బాల‌య్య డ్యూయెట్ అదిరిపోయింది!

By:  Tupaki Desk   |   15 Dec 2022 6:30 AM GMT
శ్రుతిహాస‌న్ తో బాల‌య్య డ్యూయెట్ అదిరిపోయింది!
X
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'వీరసింహారెడ్డి'. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నటసింహా ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్పటివరకూ పోస్టర్లు టీజర్ మొదటి పాటతో క్యూరియాసిటీని పెంచడంలో మలినేని బృందం పెద్ద సక్సెసైందనే చెప్పాలి. ఇప్ప‌టికే మొదటి పాట జై బాలయ్యకు అద్భుతమైన స్పందన వచ్చింది.

బాల‌య్య అభిమానాల్ని ఆపాట విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే 'సుగుణ సుంద‌రి' లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. పాట‌లో బాలకృష్ణ ఏజ్ లెస్ లుక్ తో నవయువకుడిని తలపిస్తున్నారు. శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్ లో అందంగా కనిపిస్తోంది.

యుగళగీతంలో లీడ్ పెయిర్ అద్భుత నృత్యాలతో అల‌రిస్తున్నారు. 'సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్ కందిపోయే లా..ప్రేమా పుట్టిందే..పిచ్చి ప్రేమ పుట్టిందే' అంటూ సాగే పాట మాస్ లో దూసుకుపోవ‌డం ప‌క్కా. పాట ఆద్యంతం ప‌రుగులు పెట్టిస్తుంది. బాల‌య్య అభిమానులు పాట‌కు స్టెప్పులు అందుకోవాల్సిందే. ఎస్.ఎస్. థమన్ అందించిన ట్యూన్స్ శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటున్నాయి.

డ్యూయెట్ కేట‌గిరీలో పాట ఆక‌ట్టుకుంటుంది. పాట కోసం ఎంపిక చేసుకున్న లోకేష‌న్స్ క‌ల‌ర్ ఫుల్ గా బాగున్నాయి. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల.. స్నిగ్ధ శర్మ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు.

ఈ చిత్రంలో దునియా విజయ్- వరలక్ష్మి శరత్కుమార్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ పై నవీన్ యెర్నేని- వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. అన్ని ప‌నులుపూర్తిచేసిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.