Begin typing your search above and press return to search.

డిస్ట్రిబ్యూటర్లకు భయపడి ఓటీటీ విడుదలకు వెళ్తున్న స్టార్ హీరో సినిమా..?

By:  Tupaki Desk   |   20 Feb 2021 10:30 AM GMT
డిస్ట్రిబ్యూటర్లకు భయపడి ఓటీటీ విడుదలకు వెళ్తున్న స్టార్ హీరో సినిమా..?
X
కోలీవుడ్ హీరో ధనుష్ - డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమాన్‘జగమే తంతిరమ్’. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది ధనుష్ కెరీర్ లో 40వ సినిమా. తెలుగులో ''జగమే తంత్రం'' అనే టైటిల్ తో రాబోతోంది. ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులవుతున్నా మేకర్స్ ఇంతవరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఆ మధ్య ఈ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారంటూ ప్రచారం జరగగా చిత్ర బృందం దానిని ఖండించింది. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ధ‌నుష్ సినిమా డైరెక్ట్ ఓటిటి పద్ధతిలో రిలీజ్ కి రెడీ అయిందని తెలుస్తోంది.

''జగమే తంత్రం'' చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారట. నిజానికి ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకొని ఎప్పటిలాగే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్ సినిమాని కూడా థియేట్రికల్ రిలీజ్ చేద్దామ‌ని మేకర్స్ చాలా రోజులుగా ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇప్పటికే కొన్ని ఓటీటీ రిలీజులు చేసిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు మీద త‌మిళ డిస్ట్రీబ్యూట‌ర్స్ వ్య‌తిరేక‌త వ్యక్తం చేస్తుండటంతో 'జగమే తంత్రం' సినిమాకి చాలా త‌క్కువ రేట్లుకి బిజినెస్ జరిగిందట. దీంతో నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ ఓటిటి విడుద‌ల‌కి మంచి ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో వారి ఫ్లాట్ ఫామ్ లోనే సినిమాను విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్ సినిమా విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.