Begin typing your search above and press return to search.

SRK ద్విపాత్రాభిన‌యం.. అట్లీ హిట్టిస్తాడ‌ని!

By:  Tupaki Desk   |   6 Sep 2021 6:49 AM GMT
SRK ద్విపాత్రాభిన‌యం.. అట్లీ హిట్టిస్తాడ‌ని!
X
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. `పఠాన్` కొన్ని షెడ్యూల్ లను పూర్తి చేసిన తరువాత కొత్త సినిమా షెడ్యూల్ కోసం షారూక్ పూణేకు వెళ్లారు. అక్కడ సౌత్ ఫిల్మ్ మేకర్ అట్లీతో తన తదుపరి ప్రాజెక్ట్ షూట్ ప్రారంభించారు. గత వారాంతంలో లాంచింగుకు హాజ‌రు కాగా SRK ని పూణే మెట్రో సిబ్బంది చుట్టుముట్టారు. త‌న‌తో ఫోటోలు దిగేందుకు పోటీప‌డ్డారు. షారూఖ్ పూణే మెట్రో సిబ్బందితో కలిసి పోజు ఇచ్చినప్పుడు మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లో క‌నిపించారు. ఖాన్ సన్ గ్లాసెస్ ధరించి క‌నిపించాడు. మెట్రో సిబ్బందికి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు.

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నుండ‌గా.. అత‌డి స‌ర‌స‌న‌ సౌత్ స్టార్స్ నయనతార -ప్రియమణి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ పాన్-ఇండియా సినిమాగా రూపొంద‌నుది. ఉత్తరాది దక్షిణాది నటీనటులు అట్లీతో చేతులు కలపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 13 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంద‌ని స‌మాచారం.

అట్లీ సౌత్ లో సెన్సేష‌న‌ల్ హిట్స్ సాధించిన ద‌ర్శ‌కుడు. రాజారాణి- పోలీస్- అదిరింది- విజిల్ లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో అత‌డి ట్రాక్ రికార్డ్ అసాధార‌ణంగా ఉంది. త‌దుప‌రి షారూక్ తో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తోనూ అత‌డు సినిమా చేయ‌నున్నారు. కొన్ని వ‌రుస ప‌రాభ‌వాల త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్ బాట‌లో ఉన్న అట్లీ వినిపించిన క‌థ‌కు ఖాన్ వెంట‌నే ఓకే చెప్ప‌డం నిజంగానే ఒక తెలివైన ఎంపిక‌ అని చెప్పాలి.

మ‌రోవైపు కింగ్ ఖాన్ షారుఖ్ తన తదుపరి చిత్రాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అతను పఠాన్ త‌ర్వాత‌ అట్లీతో సినిమా పూర్తి చేస్తారు. అలాగే రాజ్‌కుమార్ హిరాణీ తదుపరి చిత్రంలో న‌టిస్తారు. స‌ల్మాన్ `టైగర్ 3` లో అతిధి పాత్రలో క‌నిపించ‌నున్నాడు.