Begin typing your search above and press return to search.

క్షణం హీరోతో తెలుగు మిస్ ఇండియా

By:  Tupaki Desk   |   4 Sep 2016 7:30 AM GMT
క్షణం హీరోతో తెలుగు మిస్ ఇండియా
X
తెలుగు గాళ్ అయినా.. మోడలింగ్ లో మెరిసిపోతున్నా.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నా... బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా.. శోభిత ధూళిపాళకు ఇప్పటివరకూ టాలీవుడ్ పిలుపు రాలేదు. వచ్చిన అరాకొరాలో ఈమెకు నచ్చినవి లేదు. ఇన్నాళ్లకు ఈ భామకు తెలుగు సినిమా ఛాన్స్ వచ్చింది. అది కూడా క్రేజీ ప్రాజెక్టులోనే కావడం విశేషం.

శశి-రాహుల్ ల డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాలో శోభిత హీరోయిన్ గా నటించనుంది. అడివి శేష్ ఈ చిత్రంలో హీరో. ఇప్పటికే బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ రూపొందించిన రమన్ రాఘవ్ 2.0లో నటించింది శోభిత. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుండడంతో తన డ్రీమ్ నెరవేరినట్లు అవుతోందని చెబుతోంది. ఈమె టాలీవుడ్ ఎంట్రీని నిర్మాతలు కూడా కన్ఫాం చేసేశారు. 'అడివి శేష్ కి జోడీగా నటించేందుకు శోభిత ధూళిపాళను ఫైనల్ చేశాం. ఇప్పటికే మాటలు పూర్తవడమే కాదు.. అగ్రిమెంట్ కూడా సైన్ చేశాం' అని అభిషేక్ పిక్చర్స్ వర్గాలు ప్రకటించాయి.

మొదట ఈ చిత్రం కోసం పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మతో సైన్ చేశారు. కానీ పెళ్లిచూపులు సక్సెస్ తర్వాత.. అడివిశేష్ కి జోడీగా నటించేందుకు ఆమె నిరాకరించడంతో.. రీతు వర్మను నిఖిల్ హీరోగా రూపొందే సినిమాకు మార్చి.. వేరే హీరోయిన్ ని వెతుక్కుని.. చివరకు శోభిత ధూళిపాళ దగ్గర తమ సెర్చింగ్ ఆపారు దర్శక నిర్మాతలు.