Begin typing your search above and press return to search.

చైతు సినిమాకు గీత మేడమ్ అందుకే నో చెప్పిందా?

By:  Tupaki Desk   |   18 Oct 2019 1:18 PM GMT
చైతు సినిమాకు గీత మేడమ్ అందుకే నో చెప్పిందా?
X
యూత్ లో మంచి క్రేజ్ ఉండే హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇప్పటివరకూ స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాకపోయినా మొదటిసారి ఏకంగా మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్టు 'సరిలేరు నీకెవ్వరు' లో అవకాశం సాధించింది. మహేష్ తో నటించడం అంటే హీరోయిన్ గా నెక్స్ట్ లీగ్ కు చేరినట్టే. ఇదిలా ఉంటే రీసెంట్ గా రష్మిక దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే సినిమాకు నో చెప్పిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో హీరో అక్కినేని నాగచైతన్య. ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం. దిల్ రాజు బ్యానర్లో చైతు హీరోగా సినిమా అంటే మంచి ప్రాజెక్టే.. అయినా రష్మిక మాత్రం సినిమాకు ఒప్పుకోలేదు. దీనికి ఒక కారణం ఉందట. రెమ్యూనరేషన్.. ప్రొడ్యూసర్.. హీరోలను మాత్రమే చూసి కాకుండా బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే.. అందులో తన పాత్ర నచ్చితేనే సినిమా చేయాలని నిర్ణయం తీసుకుందట. అందుకే ఈ సినిమాకు అదే పాలసీ ఫాలో అయిందట.. స్క్రిప్ట్ చదివిన తర్వాతే సినిమా గురించి నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్పిందట.

ఈమధ్య రష్మిక నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచాయి. అవి క్రేజీ ప్రాజెక్టులే అయినా సినిమాలు హిట్ కాలేదు. అందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకుందట.