Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మను ఇంకా చేస్తూనే ఉన్నారు, ఈసారి సిమ్రాన్

By:  Tupaki Desk   |   14 May 2020 12:48 PM IST
బుట్ట బొమ్మను ఇంకా చేస్తూనే ఉన్నారు, ఈసారి సిమ్రాన్
X
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా లోని పాటలు ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. సినిమా ఇండస్ట్రీ హిట్ కు కారణం సినిమాలోని పాటలు అనడంలో సందేహం లేదు. పాటలు వచ్చి ఆరు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటికి కూడా పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇప్పటివరకు ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ పాటకు టిక్ టాక్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హాటీ శిల్ప శెట్టి మరియు డేవిడ్ వార్నర్ లు ఈ పాటకు చేసిన టిక్ టాక్ వీడియోలు సంచలంగా అయ్యాయి. ఇప్పుడు ఈ పాటకు నిన్నటి తరం హీరోయిన్ సిమ్రాన్ కూడా స్టెప్పులు వేసింది. డాన్స్ తో ఎప్పుడు నేను చాలా ఉల్లాసంగా ఉంటాను అంటూ ఈ వీడియో పోస్ట్ చేసి కామెంట్ పెట్టింది.

ఈ వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పాట క్రేజ్ విపరీతంగా పెరిగి పోయింది. థమన్ స్థాయి ఈ సినిమా పాటలతో భారీగా పెరిగింది అనడంలో సందేహమే లేదు. పెద్ద ఎత్తున ఆయనకు స్టార్ సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి.