Begin typing your search above and press return to search.
శింబు సింగిల్ టేక్.. కుమ్మేశాడంతే..!
By: Tupaki Desk | 26 April 2021 3:00 PM ISTనటన కొంతమందికి చాలా కష్టం. మరికొంత మందికి మాత్రం చాలా సులువు. ఒక్కసారి స్క్రిప్ట్ చదివారంటే అలా ఆ పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. ఎంత భారీ డైలాగు లు అయినా సింగిల్ టేక్ లో చెప్పేస్తుంటారు కొందరు నటులు. తెలుగులో ఎన్టీఆర్, ఎస్వీఆర్, కృష్ణ ఎంత భారీ డైలాగులనైనా ఒక్కసారి చదువుకొని చెప్పేవారంట. నటనలోనూ ఆ హావభావాలు పలికించేవారట. ఇక పదుల సంఖ్యలో టేకులు తీసుకొనే నటులూ ఉన్నారు.
ఇదిలా ఉంటే తమిళంలోనూ చాలా మంది సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో హీరోలు కూడా ఉన్నారు. ప్రముఖ నటుడు శింబు ఆ కోవకే చెందుతారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అలవోకగా చెప్పడం శింబుకు అలవాటు. ఎందుకంటే శింబుకు నటన మీద, తన పాత్ర మీద అంత కమాండ్ ఉంటుంది. శింబు స్వయంగా దర్శకుడు, రచయిత కాబట్టి.. అతడికి నటన లో ఆ రేంజ్లో గ్రిప్ ఉంటుంది. ఎంత పెద్ద డైలాగు అయినా చాలా ఈజీగా చెప్పేయడం.. నటలోనూ ఆ హావభావాలు పలికించడం శింబు కు వెన్నతో పెట్టిన విద్య. శింబు తండ్రి రాజేందర్ కూడా గొప్ప రచయిత, దర్శకుడు సో శింబూ.. నటనలోని మెళకువలను తన తండ్రి వద్దే నేర్చుకున్నాడు.
తాజాగా శింబూ ఆరు నిమిషాల ఓ సీన్ను సింగిల్ టేక్లో పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన మనాడు అనే చిత్రంలో నటిస్తున్నాడు. వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నటి కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.
శనివారం నటుడు శింబు, కళ్యాణి ప్రియదర్శన్, ఎస్ జె సూర్య, ప్రేమ్ జీ పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సీన్ మొత్తం ఆరు నిమిషాలు ఉంటుంది. అయితే దర్శకుడు సన్నివేశాన్ని వివరించిన వెంబడే శింబూ ఒకే టేక్ లో మొత్తం సీన్ చేసేశాడు. దీంతో అక్కడున్న యూనిట్ ఆశ్చర్యపోయింది. గతంలోనూ చాలా సార్లు శింబూ ఒకే టేక్ లో సన్నివేశాన్ని రక్తికట్టించాడు. శింబూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే విషయం మరోసారి రుజువైందని ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తమిళంలోనూ చాలా మంది సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో హీరోలు కూడా ఉన్నారు. ప్రముఖ నటుడు శింబు ఆ కోవకే చెందుతారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అలవోకగా చెప్పడం శింబుకు అలవాటు. ఎందుకంటే శింబుకు నటన మీద, తన పాత్ర మీద అంత కమాండ్ ఉంటుంది. శింబు స్వయంగా దర్శకుడు, రచయిత కాబట్టి.. అతడికి నటన లో ఆ రేంజ్లో గ్రిప్ ఉంటుంది. ఎంత పెద్ద డైలాగు అయినా చాలా ఈజీగా చెప్పేయడం.. నటలోనూ ఆ హావభావాలు పలికించడం శింబు కు వెన్నతో పెట్టిన విద్య. శింబు తండ్రి రాజేందర్ కూడా గొప్ప రచయిత, దర్శకుడు సో శింబూ.. నటనలోని మెళకువలను తన తండ్రి వద్దే నేర్చుకున్నాడు.
తాజాగా శింబూ ఆరు నిమిషాల ఓ సీన్ను సింగిల్ టేక్లో పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన మనాడు అనే చిత్రంలో నటిస్తున్నాడు. వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నటి కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.
శనివారం నటుడు శింబు, కళ్యాణి ప్రియదర్శన్, ఎస్ జె సూర్య, ప్రేమ్ జీ పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సీన్ మొత్తం ఆరు నిమిషాలు ఉంటుంది. అయితే దర్శకుడు సన్నివేశాన్ని వివరించిన వెంబడే శింబూ ఒకే టేక్ లో మొత్తం సీన్ చేసేశాడు. దీంతో అక్కడున్న యూనిట్ ఆశ్చర్యపోయింది. గతంలోనూ చాలా సార్లు శింబూ ఒకే టేక్ లో సన్నివేశాన్ని రక్తికట్టించాడు. శింబూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే విషయం మరోసారి రుజువైందని ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
