Begin typing your search above and press return to search.

పీస్ అంటూనే ప్రచారం చేస్తే ఎలా

By:  Tupaki Desk   |   26 Aug 2017 10:48 AM GMT
పీస్ అంటూనే ప్రచారం చేస్తే ఎలా
X
సెలబ్రిటీలు ట్వీట్స్ పెట్టే ముందు చాలా అలర్ట్ గా ఉండాలి. లేకపోతే సోషల్ మీడియా జనాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటారనే సంగతి ఇప్పటికి చాలా సార్లే ప్రూవ్ అయినా.. ఇంకా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండడం మాత్రం కొందరు సినిమా జనాలకు తెలియలేదు. ఓ ట్వీట్ కారణంగా బాలీవుడ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రా విపరీతంగా ట్రాలింగ్ కి గురి కావాల్సి వచ్చింది.

ఏ జెంటిల్మన్ మూవీ ప్రచారం కోసం హీరో సిద్ధార్ధ మల్హోత్రా ఓ ట్వీట్ పెట్టాడు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి తను నటించిన సినిమాను చూడాలన్నది ఈ ట్వీట్ సారాంశం. అయితే.. కాసిన్ని తెలివితేటలు ఉపయోగించి.. హర్యానా పంజాబ్ జనాలను ప్రత్యేకంగా ఆకట్టుకునేందు కోసం స్పెషల్ ట్వీట్ పెట్టాడు. "హర్యానా ప్రజలందరూ జాగ్రత్తగా.. భద్రంగా ఉండడం. అలాగే మా సినిమా ఏ జెంటిల్ మ్యాన్ ను కూడా చూడండి" అంటూ ట్వీట్ పెట్టిన సిద్ధార్ధ్.. పీస్ అండ్ లవ్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు.

ప్రస్తుతం పంజాబ్ హర్యానాలు గుర్మీత్ రామ్ రహీమ్ అరెస్ట్ కారణంగా అల్లర్లతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఇలా ట్వీట్ చేయడంతో.. జనాలు ఆడేసుకున్నారు. ఈ రెండు టాపిక్స్ కు వేర్వేరుగా ట్వీట్స్ పెట్టచ్చని తెలుసా అని ఒకరు నిలదీస్తే.. రామ్ రహీమ్ తీర్పును సినిమా కోసం వాడుకుంటున్నావా అంటూ మరొకరు అడిగారు.సినిమా ప్రమోషన్ లేకుండానే వారిని శాంతితో మెలగమని చెప్పచ్చా సిద్ అన్నది మరొకరి ట్వీట్. అయినా ట్వీట్స్ పెట్టడంలో ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా సిద్ధార్ధ్!