Begin typing your search above and press return to search.
తెలుగులో మాస్ రాజా హీరోయిన్ రీ-ఎంట్రీ ఇవ్వనుందా..??
By: Tupaki Desk | 11 March 2021 8:45 AMసినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి కనుమరుగై పోతారు. అలా ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ సియా గౌతమ్. మాస్ రాజా రవితేజ నటించిన నేనింతే సినిమాతో ఈ ముంబై భామ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారు విజయం అందుకుంది. కానీ ఫస్ట్ మూవీలోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది సియా. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. 2008లో కెరీర్ ప్రారంభించిన సియా.. తెలుగులో నేనింతే తర్వాత వేదం సినిమాలో మెరిసింది.
అలాగే బాలీవుడ్ లో హీరో రణబీర్ కపూర్ నటించిన సంజు మూవీలో చివరిసారిగా కనిపించింది. దాదాపు సియా తెలుగులో కనిపించి పదకొండేళ్లు కావస్తుంది. అయినా సరే ఇప్పటివరకు మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే సియా అసలు పేరు అతిథి గౌతమ్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటోంది. ఇదిలా ఉండగా.. సియా త్వరలోనే తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. హీరో గోపీచంద్ - డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'పక్కా కమర్షియల్' మూవీలో సియా ఓ కీలకపాత్ర పోషించనుందని టాక్. ఇప్పటికే డైరెక్టర్ మారుతీ సియాతో సంప్రదింపులు జరిపాడని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే బాలీవుడ్ లో హీరో రణబీర్ కపూర్ నటించిన సంజు మూవీలో చివరిసారిగా కనిపించింది. దాదాపు సియా తెలుగులో కనిపించి పదకొండేళ్లు కావస్తుంది. అయినా సరే ఇప్పటివరకు మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే సియా అసలు పేరు అతిథి గౌతమ్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటోంది. ఇదిలా ఉండగా.. సియా త్వరలోనే తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. హీరో గోపీచంద్ - డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'పక్కా కమర్షియల్' మూవీలో సియా ఓ కీలకపాత్ర పోషించనుందని టాక్. ఇప్పటికే డైరెక్టర్ మారుతీ సియాతో సంప్రదింపులు జరిపాడని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.