Begin typing your search above and press return to search.

శృతి ఎవరికీ ఇవ్వదట.. తానే రన్ చేస్తుందట

By:  Tupaki Desk   |   4 Jan 2020 4:16 AM GMT
శృతి ఎవరికీ ఇవ్వదట.. తానే రన్ చేస్తుందట
X
మీడియాను మించి పోతోంది సోషల్ మీడియా. హద్దులు లేని రీతిలో చెలరేగిపోతున్న సోషల్ మీడియాకు కళ్లాలు వేసే శక్తి ఇప్పుడెవరికి లేదు. ఎవరైనా సరే.. దాని తో పాటు అడుగులు వేయాల్సిందే. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రముఖులు.. సెలబ్రిటీలు మూడు నాలుగేళ్ల కింద నుంచే తమ సోషల్ మీడియా ఖాతాల్ని నిర్వహించేందుకు ఎవరికి వారు.. ఒక టీంను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి.

గతంలో కారు డ్రైవర్.. పర్సనల్ అసిస్టెంట్.. ఇలాంటివి ఎంత ముఖ్యమో.. ఇవాల్టి రోజున ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల్ని నిర్వహించే టీం తప్పని సరిగా మారింది. సోషల్ మీడియా టీం లేని వారు ఇప్పుడు చాలా తక్కువ. అన్నింటికి మించి సోషల్ మీడియాను తమకుతాముగా సొంతంగా నిర్వహించేటోళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు.

గబ్బర్ సింగ్ భామగా సుపరిచితురాలు.. ఆ మధ్య ప్రేమ కారణంగా కెరీర్ కు కామా పెట్టేసిన శృతిహాసన్.. తాను చేసిన తప్పును గుర్తించింది. ప్రేమ లో మునిగి పోయి.. సినిమాలకు దూరమైన ఆమె.. ప్రేమ దూరమైన తర్వాత మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేసింది. తాజాగా రవితేజ సినిమా లో నటిస్తున్న ఆమె.. నెమ్మదిగా బిజీ అవుతోంది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చింది.

అన్నింటికి మించి తన సోషల్ మీడియా ఖాతాల్ని తానే రన్ చేస్తానని.. ఎవరి మీదా ఆధారపడనని.. అభిమానులు పెట్టే పోస్టులకు తానే నేరుగా స్పందిస్తానని ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం జరిగినప్పుడు మీ రియాక్షన్ ఏమిటంటే.. కూల్ గా.. వాటిని పట్టించుకోనని చెప్పేసింది. మిగిలిన వారికి భిన్నంగా తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ ఎవరికీ ఇవ్వకుండా.. తనకు తానే మొయింటైన్ చేయటం గొప్పని చెప్పక తప్పదు. చూస్తుంటే.. శృతి చేతిలో ఖాళీ టైం బాగానే ఉన్నట్లుందే.