Begin typing your search above and press return to search.

వైష్ణోదేవి ఆలయానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి

By:  Tupaki Desk   |   18 Sept 2021 9:00 AM IST
వైష్ణోదేవి ఆలయానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి
X
అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం తర్వాత ఆయన భార్య శిల్పాశెట్టి పెద్దగా బయట కనిపించడం లేదు. ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కుంద్రాపై విచారణ కొనసాగుతోంది. శిల్పాశెట్టి తన భర్తకు విడాకులు ఇవ్వబోతోందనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా దైవదర్శనం కోసం జమ్మూకశ్మీర్ కు శిల్పాశెట్టి వెళ్లింది. తన స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ గుర్రపు స్వారీ చేస్తూ ఆమె దర్శనానికి వెళ్లారు.

వైష్ణోదేవి ఆలయంలో శిల్పాశెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'అమ్మవారి పిలుపు.. ఆశీస్సుల మేరకు దర్శనానికి వచ్చాను' అని శిల్పా శెట్టి పేర్కొన్నారు.

ఇక రాజ్ కుంద్రా కేసులో గురువారం ముంబై పోలీసులు సాక్షిగా చార్జ్ షీట్ లో శిల్పాశెట్టి పేరు నమోదు చేశారు. తన బిజీ షెడ్యూల్స్ వల్ల రాజ్ కుంద్రా ఏం వ్యాపారం చేస్తున్నాడో.. ఎప్పుడు ఏం చేశాడో తెలియదని.. తన అశ్లీల వీడియోల చిత్రాల గురించి తనకు తెలియదని శిల్పా పేర్కొంది.