Begin typing your search above and press return to search.

100 మిలియన్ క్లబ్ లో శర్వానంద్ సాంగ్..!

By:  Tupaki Desk   |   28 April 2021 10:38 AM GMT
100 మిలియన్ క్లబ్ లో శర్వానంద్ సాంగ్..!
X
వర్సటైల్ హీరో శర్వానంద్ విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలచుకునే శర్వా.. 'జాను' సినిమాలో కాస్త వయసు మీద పడిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌ రామచంద్ర పాత్రలో నటించాడు. అతని పాత్రను ఇష్టపడిన ఆడియన్స్.. 'లైఫ్ ఆఫ్ రామ్' పాటను సూపర్ హిట్ చేసేశారు. ఆదిత్య మ్యూజిక్ ఛానెల్‌ ద్వారా విడుదల చేయబడిన ఈ వీడియో సాంగ్, యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి అరుదైన ఘనత సాధించింది.

ప్రేక్షకులలో శర్వానంద్‌ కు ఉన్న ఆదరణ 'జాను' చిత్రంలోని ఈ పాటను క్లాసిక్‌ గా మార్చిందని చెప్పవచ్చు. 'ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా..' అంటూ సాగిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సింగర్ ప్రదీప్ కుమార్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడు. మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్ సమకూర్చిన ట్యూన్ శ్రోతలను వెంటాడేలా చేసింది. ఈ పాటలో ఎడారులు, అడువులు, నదులు సముద్రాలు.. ఇలా ప్రకృతిని చూపిస్తూ మహేందిరన్ జయరాజు అందించిన విజువల్స్ అదిరిపోయాయి.

'లైఫ్ ఆఫ్ రామ్' వీడియో సాంగ్ మనసుకి అంత దగ్గరై వీక్షకుల జ్ఞాపకాల్లో ఉండటానికి శర్వా నటన కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఈ పాట మైలురాయి 100 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'జాను' చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. సమంత అక్కినేని హీరోయిన్ గా నటించింది. ఇక శర్వా విషయానికొస్తే.. ప్రస్తుతం 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' అనే సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో కిశోర్ తిరుమ‌ల తో 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రంలో నటిస్తున్నారు. అలానే కొత్త దర్శకుడితో తెలుగు తమిళ భాషల్లో ఓ బైలింగ్విల్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.