Begin typing your search above and press return to search.

శర్వానంద్ 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' ముహూర్తం ఖరారు...!

By:  Tupaki Desk   |   23 Oct 2020 1:30 PM GMT
శర్వానంద్ ఆడాళ్లూ.. మీకు జోహార్లు ముహూర్తం ఖరారు...!
X
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలను విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' అనే సినిమాలో శర్వా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ముహూర్తం మరియు వేదిక ఖరారు చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాగా, 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' చిత్రం మహిళల గొప్పతనాన్ని వివరించే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్‌ కు మంచి ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని రైట్ సబ్జెక్టు ఎంచుకున్నాడని చెప్పవచ్చు. 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'చిత్రలహరి' 'రెడ్' వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల తొలిసారి శర్వానంద్ తో కలవబోతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. అలానే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' అనే చిత్రాన్ని ప్రకటించిన శర్వా.. ఏసియన్ సోనాలి నారంగ్ సమర్పణలో ఓ సినిమా చేయనున్నాడు.