Begin typing your search above and press return to search.

కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో శర్వా..?

By:  Tupaki Desk   |   22 Sep 2021 2:30 AM GMT
కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో శర్వా..?
X
టాలెంటెడ్ హీరో శర్వానంద్ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'శ్రీకారం' సినిమాతో పలకరించిన శర్వా.. మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్వకత్వంలో శర్వా ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.

శర్వానంద్ హీరోగా రాజు సుందరం డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంఫర్మ్ అయిందని అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతుండగా.. ఇటీవలే శర్వా సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చిందట. ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో 'ఏగన్' అనే సినిమాతో దర్శకుడి అవతారమెత్తిన రాజుసుందరం.. ఇప్పుడు శర్వా కోసం మరోసారి మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

శర్వా - రాజు సుందరం కాంబోలో రాబోయే ఈ చిత్రానికి ప్రముఖ దర్శక రచయిత వక్కంతం వంశీ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే శర్వానంద్ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలోకి వస్తోంది.

అలానే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు శర్వా. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్నారు. ఇక శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడితో శర్వా 'ఒకే ఒక జీవితం' అనే సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.