Begin typing your search above and press return to search.

విడుదల విషయంలో సూపర్‌ స్టార్స్‌ ఫైట్‌!

By:  Tupaki Desk   |   14 Nov 2018 6:10 AM GMT
విడుదల విషయంలో సూపర్‌ స్టార్స్‌ ఫైట్‌!
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ మరియు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ లు మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా దాదాపు పాతిక సంవత్సరాలుగా తమ స్నేహంను కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకరి వేడుకల్లో ఒకరు తప్పకుండా పాల్గొంటూనే ఉంటారు. అటువంటి వీరి స్నేహంకు బీటలు వారే పరిస్థితి వచ్చింది. తాజాగా వారిద్దరి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీకి సిద్దం అవుతున్నాయి. రెండు సినిమాల మద్య వారం రోజుల గ్యాప్‌ అనుకున్నారు. అయితే మొదట విడుదలవ్వబోతున్న షారుఖ్‌ సినిమా కోసం రెండవ వారంలో కూడా థియేటర్లను బుక్‌ చేశారట.

షారుఖ్‌ ‘జీరో’ చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ రీమేక్‌ చిత్రం ‘సింబా’ విడుదల కావాల్సి ఉంది. అయితే సింబాకు ఇప్పుడు థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. షారుఖ్‌ ఖాన్‌ తో కరణ్‌ జోహార్‌ మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ కారణంగానే సింబా చిత్రం విడుదల తేదీని మార్చాలనే నిర్ణయానికి కరణ్‌ జోహార్‌ వచ్చినట్లుగా బాలీవుడ్‌ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

షారుఖ్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్రంను డిపెంబర్‌ 21న విడుదల చేయబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ‘సింబా’ చిత్రాన్ని డిసెంబర్‌ 28న విడుదల చేయాల్సి ఉంది. కాని ఆ తేదీకి ఎక్కువ థియేటర్లు లభించని కారణంగా ఏదైతే అదే అయ్యింది - క్రిస్మస్‌ సెలవులను వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో డిసెంబర్‌ 21నే అంటే ‘జీరో’ చిత్రం విడుదల తేదీ రోజునే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని కరణ్‌ జోహార్‌ మరియు దర్శకుడు రోహిత్‌ షెట్టి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే మాత్రం ఖచ్చితంగా షారుఖ్‌ - కరణ్‌ జోహార్‌ ల స్నేహం చెడిపోవడం ఖాయం అని, ఇద్దరి మద్య విభేదాలు మొదలవ్వడం ఖాయం అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.