Begin typing your search above and press return to search.

ట్రైన్ ప్రమోషన్స్.. అభిమాని చనిపోయాడు

By:  Tupaki Desk   |   24 Jan 2017 10:41 AM IST
ట్రైన్ ప్రమోషన్స్.. అభిమాని చనిపోయాడు
X
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ లేటెస్ట్ మూవీ రాయీస్. ఈ నెల 25న రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ప్రమోషన్స్ ను పీక్ స్టేజ్ కి తీసుకొచ్చేసింది రాయీస్ యూనిట్. అయితే.. ప్రతీ సినిమాకి డిఫరెంట్ గా పబ్లిసిటీ చేయాలని భావించడం బాలీవుడ్ లో సహజం. రాయీస్ టీం చేసిన అలాంటి ప్రయత్నం.. ఒక వ్యక్తి మరణానికి కారణమైంది.

ఢిల్లీకి ట్రైన్ లో జర్నీ చేస్తూ రాయీస్ కి ప్రమోట్ చేస్తున్నట్లు ముందుగానే చెప్పాడు షారూక్. ఈ ట్రిప్ లో భాగంగా వడోదర స్టేషన్ మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయింది. దీంతో ట్రైన్ లోంచే మైక్ ద్వారా కాసేపు మాట్లాడాడు కింగ్ ఖాన్. అందరినీ సినిమా చూడాల్సిందిగా చెప్పాడు. ఫరీద్ ఖాన్ షెరానీ అనే అభిమాని కూడా షారూక్ ను చూసేందుకు తన భార్యా పిల్లలతో కలిసి వచ్చాడు. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత.. తోపులాట మొదలైంది. అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. తొక్కిసలాట జరిగింది. దీనిలో ఫరీద్ ఖాన్ తో పాటు మరో వ్యక్తి కూడా కింద పడిపోవడంతో.. జనాలు తొక్కివేశారు.

హాస్పిటల్ కి తీసుకెళ్లే సరికే ఫరీద్ ఖాన్ చనిపోగా.. మరో వ్యక్తి మాత్రం కోలుకుంటున్నాడు. ఇద్దరు పోలీసులు కూడా ఈ తొక్కిసలాటలో ఆస్పత్రి పాలు కాగా.. వారు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. సూపర్ స్టార్ పై అభిమానం.. రైల్వే స్టేషన్ లో ప్రచారం.. నియంత్రించడానికి కష్టమైనంత అభిమాన సమూహం.. మొత్తం మీద వడోదర ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/