Begin typing your search above and press return to search.

తెరమీదకి మరోసారి సెన్సేషనల్ పెయిర్..!

By:  Tupaki Desk   |   16 April 2021 11:30 PM GMT
తెరమీదకి మరోసారి సెన్సేషనల్ పెయిర్..!
X
టాలీవుడ్ రీసెంట్ డెబ్యూ పెయిర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి. వీరిద్దరూ ఈ ఏడాది విడుదలైన రొమాంటిక్ లవ్ స్టోరీ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఇద్దరూ యాక్టింగ్ ఇరగదీశారు. మంచి పెయిర్ గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అయితే ఈ సినిమాలో కృతి, వైష్ణవ్ జనాలకు ఎంతబాగా కనెక్ట్ అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు. అటు యాక్టింగ్ ఎక్సప్రెషన్స్ పరంగా కృతి అయితే కుర్రకారును తన వలలో వేసుకుంది. బేబమ్మ అంటే ఎప్పటికి కృతినే గుర్తుండేలా తీర్చిదిద్దారు మేకర్స్. అలాగే ఆసి పాత్రలో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకున్నాడు. మరి మొదటి సినిమాతోనే బెస్ట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట మరోసారి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది.

వీరిద్దరూ కేవలం ఒక్కసినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మరి మరోసారి ఈ పెయిర్ తో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిజానికి వైష్ణవ్ - కృతిని మరోసారి తెరపై చూడాలని మెగాఫ్యాన్స్, కృతిఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ల కోరికలు ఫలించే సమయం ఆసన్నమైనట్లుంది. ఉప్పెనతో ఇంట్రడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ పెయిర్ తో మరో సినిమా లైన్ చేస్తున్నారట. కానీ ఆ సినిమాను నూతన దర్శకుడే తెరకెక్కిస్తాడని టాక్. దాని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఫస్ట్ హిట్ తోనే హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయారు. వైష్ణవ్ ఇప్పటికే ఓ సినిమా పూర్తిచేసి మూడో సినిమా లైన్ లో పెట్టేసాడు. అటు కృతిశెట్టి రామ్ సరసన చేస్తూనే.. సుధీర్ తో మరో సినిమా చేస్తోంది. మొత్తానికి ఈ స్టార్ పెయిర్ క్రేజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చూడాలి మరి ఈ కాంబోలో సెకండ్ మూవీ వస్తుందేమో!