Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రిలో చేరిన సీనియ‌ర్ న‌టుడు.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

By:  Tupaki Desk   |   7 April 2021 10:30 AM GMT
ఆసుప‌త్రిలో చేరిన సీనియ‌ర్ న‌టుడు.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!
X
తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు అయిన‌ సీనియ‌ర్ న‌టుడు కార్తీక్ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. కొంత కాలం క్రితమే తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత కోలుకున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న కార్తీక్‌‌.. మ‌రోసారి అనారోగ్యం పాల‌య్యారు.

న‌టుడిగా వెండితెర‌పై త‌న‌దైన ముద్ర‌వేసిన కార్తీక్.. గాలిలేని తుఫానులా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. సొంతంగా పార్టీని కూడా ప్ర‌క‌టించారు. అయితే.. అనారోగ్యం వేధించ‌డంతో కొంత‌కాలానికే పార్టీని ర‌ద్దు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారంలోకి కూడా దిగారు.

కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉన్న ఆయ‌న.. ఈ సోమ‌వారం ప్ర‌చారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో.. కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అడ‌యార్ లోని ఓ ప్రైవేటు ద‌వాఖానాలో ఆయ‌న చేర్పించారు.

కార్తీక్‌ శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. తాజాగా ర‌క్త‌పోటుకూడా ఎక్కువైంద‌ని, అందుకే అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యార‌ని వైద్యులు చెప్పిన‌ట్టు తెలిసింది. కాగా.. గ‌త నెల 21న కూడా ఆసుప‌త్రిలో చేరారు కార్తీక్‌. ఆ త‌ర్వాత డిశ్చార్జ్ చేసిన డాక్ట‌ర్లు.. విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. కానీ.. ఆయ‌న ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన‌డంతో మ‌ళ్లీ జ‌బ్బుచేసిన‌ట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్తీక్ కోలుకోవాలని పూజలు చేశారు.