Begin typing your search above and press return to search.

శోక‌సంద్రంలో సీనియ‌ర్ న‌టి క‌విత‌.. భ‌ర్త- కొడుకుని మింగేసిన క‌రోనా

By:  Tupaki Desk   |   30 Jun 2021 9:00 AM GMT
శోక‌సంద్రంలో సీనియ‌ర్ న‌టి క‌విత‌.. భ‌ర్త- కొడుకుని మింగేసిన క‌రోనా
X
క‌రోనా మ‌హ‌మ్మారి ఎన్నో కుటుంబాల్ని క‌బ‌ళించింది. ఎందరో ప‌సికందుల్ని అనాధ‌ల్ని చేసింది. ఒకే కుటుంబంలో ఇద్ద‌రు ముగ్గురిని క‌బ‌లించి అతఃహ‌శుల్నే చేసింది. ఇలా క‌రోనా మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇక సెల‌బ్రిటిల్లోనూ ఇలాంటి క‌థ‌లెన్నో. తాజాగా సీనియ‌ర్ న‌టి క‌విత వెంట వెంట‌నే ఇద్ద‌రు కుటుంబీకుల్ని కోల్పోయి శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇప్ప‌టికే డెల్టా వేరియంట్ తో కుమారుడిని పోగ‌ట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న కవిత‌కు మ‌రో కోలుకోలేని షాక్ త‌గిలింది. క‌విత భ‌ర్త ద‌శ‌ర‌థ్ రాజ్ కూడా గురువారం మ‌హ‌మ్మారికి బ‌లయ్యారు. చెన్నైలోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న కూడా తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్ని వారాలుగా డెల్టా వేరియంట్ వైర‌స్ సోకి తీవ్రంగా బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోనే చికిత్స పొందుతున్నారు. అయితే నేడు ఆరోగ్యం విష‌మించి మ‌ర‌ణించారు. ఇలా ఒకే నెల‌లో కుమారుడిని..భ‌ర్త‌ని కోల్పోయిన క‌విత తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.

ఇంత‌కుముందు క‌విత కుమారుడికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో వెంట‌నే హోమ్ అసోలేష‌న్ లోకి వెళ్లారు. అనంత‌రం ప‌రిస్థితులు ఆందోళ‌నక‌రంగా మార‌డంతో వెంట‌నే ఓ ప్రయివేటు ఆసుప‌త్రిలో చేర్చారు. చివ‌రికి ఆరోగ్యం విష‌మించి ఆసుప‌త్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు భ‌ర్త కూడా తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో క‌విత క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.