Begin typing your search above and press return to search.
రాజాని పరిగెట్టించిన పాప.. రాజుగారి గదిలో?
By: Tupaki Desk | 28 Nov 2016 10:20 AM ISTబుల్లితెర ఫేమస్ సెలబ్రిటీ ఓంకార్ డైరెక్షన్ లో విజయం సాధించిన రాజు గారి గది సినిమాకు సీక్వెల్ వుంటుందని ఎప్పుడో ప్రకటించాడు. దాన్ని నిన్న లాంఛనంగా ప్రారంభించడమేకాక నాగార్జున వంటి హీరోని స్పెషల్ రోల్ కి ఒప్పించి మెప్పించాడు. నాగ అశ్విన్ - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సినిమా అంతా హర్రర్ కామెడీ నేపథ్యంలో సాగనుందిగనుక మొదటి సిరీస్ తో పోల్చుకుంటే క్యాస్టింగ్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఓంకార్. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో.. రన్ రాజా రన్ లో నటించి విజయం సాధించిన సీరత్ కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం.
అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటన జరగలేదు. పి.వి.పి మరియు ఓక్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
