Begin typing your search above and press return to search.

అఖిల్‌ హీరోయిన్‌ కు ఆస్ర్టియా దెబ్బ

By:  Tupaki Desk   |   19 Sept 2015 9:27 AM IST
అఖిల్‌ హీరోయిన్‌ కు ఆస్ర్టియా దెబ్బ
X
అఖిల్ యూనిట్ ఆస్ట్రియాలో షూటింగ్ ఫినిష్ చేసుకొచ్చి నెలదాటిపోయింది. అయినా.. అక్కడ మొదలైన శ్వాస సంబంధిత ఇబ్బంది ఇంకా హీరోయిన్ సాయేషా సైగల్ ని వదల్లేదు. ఆస్ట్రియా అంటే అన్నీ మంచుకొండలే. శరీరం జిల్లుమనిపించే వాతావరణంలో.. గ్లామరస్ గా నటించడమంటే మామూలు విషయం కాదు. ఇందుకే స్నిఫిల్స్ (సింపుల్‌ గా తుమ్ములు) అటాక్ చేశాయా అంటే మాత్రం.. అవునని, కాదని అనకుండానే ఏదేదో సమాధానం చెబ్తోంది సాయేషా.

అఖిల్ ఆస్ట్రియా షెడ్యూల్ చివరి రోజున జబ్బు పడిందట ఈ భామ. ఆస్ట్రియా లొకేషన్స్ అదిరిపోయాయని, డైరెక్టర్ వినాయక్ బ్రహ్మాండమైన విజువల్స్ చూపించబోతున్నారని అంది. ముంబై వాతావరణంలోనే అమ్మడికి చలి వేస్తుందట. మరి ఆస్ట్రియాలో అయితే వణికిపోయానంటోంది. అయితే.. కేవలం గ్లామర్ గా నటించినందుకే మాత్రం ఇన్ఫెక్షన్ అటాక్ చేయడం కరెక్ట్ కాదంటోంది.

ఆస్ట్రియా వాతావరణం తన ఆరోగ్యంపై ప్రభావం చూపినా.. అవుడ్డోర్ షూటింగ్ బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది సాయేషా సైగల్. ఈ భామ బాగా తెలివిగా సమాధానం చెప్పానని అనుకుంటోంది కానీ.. అసలు విషయం మీకు అర్ధమైందనుకుంటా? పాపం ఫస్టు టైమ్‌ కదా.. ఇలా అవుట్‌ డోర్‌ లో కాస్త సెక్సీ కాస్ట్యూమ్సుతో చేయడం తొలిసారిగా.. ఈసారికి అలవాటైపోతుందిలే.