Begin typing your search above and press return to search.

ఆ హీరో నెగెటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడా...?

By:  Tupaki Desk   |   13 Sep 2020 1:30 AM GMT
ఆ హీరో నెగెటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడా...?
X
సినీ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని నిలదొక్కుకున్నవారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఒకరు. 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో చిన్న రోల్ లో కనిపించిన సత్యదేవ్.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'ముకుంద' లాంటి ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు. పూరీ జగన్నాథ్ 'జ్యోతి లక్ష్మి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఈ క్రమంలో గత కొన్ని ఏళ్లుగా వైవిధ్యభరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 'క్షణం' 'అంతరిక్షం' 'ఘాజీ' 'బ్లఫ్ మాస్టర్' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' 'సరిలేరు నీకెవ్వరు' '47 డేస్' వంటి సినిమాల్లో నటించాడు. 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' 'లాక్డ్' అనే రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. ఇక ఇటీవల ఓటీటీలో రిలీజైన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో సత్యదేవ్ హీరోగా మరో మెట్టు ఎక్కాడు.

టాలీవుడ్ లో హీరోగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని ఉన్న సత్యదేవ్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించడానికి రెడీ అంటున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ మాట్లాడుతూ నెగెటివ్ రోల్స్ లో నటించాడనికి సిద్ధమే కానీ రెగ్యులర్ విలన్ రోల్స్ కాకుండా హీరోకి ధీటుగా ఉండే పాత్ర అయితే నటించడానికి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడట. ప్రస్తుతం సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా తో కలిసి నటిస్తున్నాడు. దీంతో పాటు 'తిమ్మరసు' అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా 'స్కై లాబ్' అనే థ్రిల్లర్ మూవీలో నిత్యా మీనన్ తో కలసి నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.