Begin typing your search above and press return to search.

‘క్షణం’ రీమేక్.. ప్రభాస్ ఓకే చేశాకే

By:  Tupaki Desk   |   3 Dec 2017 10:45 AM GMT
‘క్షణం’ రీమేక్.. ప్రభాస్ ఓకే చేశాకే
X
గత ఏడాది తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన చిన్న సినిమాల్లో ‘క్షణం’ ఒకటి. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమాను చాలా పెద్ద హిట్టయింది. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం ఇతర భాషల నుంచి గట్టి పోటీనే నెలకొంది. తమిళంలో సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. అతనే కథానాయకుడిగా ‘సత్య’ పేరుతో ‘క్షణం’ రీమేక్ అయింది.

ఐతే తాము ఈ చిత్ర రీమేక్ హక్కులు కొనేముందు ప్రభాస్ సలహా తీసుకున్నట్లుగా సత్యరాజ్ చెప్పడం విశేషం. గత ఏడాది తాను బాహుబలి షూటింగులో ఉన్న సమయంలో తన కొడుకు తనకు ఫోన్ చేశాడని.. ‘క్షణం’ సినిమా గురించి కనుక్కోమని అన్నాడని.. అప్పుడు ప్రభాస్ తన పక్కనే ఉండటంతో దీని గురించి అడిగానని.. చాలా మంచి సినిమా అని.. తప్పకుండా రీమేక్ హక్కులు తీసుకోమని ప్రభాస్ ధీమాగా చెప్పాడని.. అతను అంత భరోసాతో చెప్పాక తన కొడుకును హక్కులు తీసుకోమన్నానని సత్యరాజ్ తెలిపాడు.

ఇక ఈ చిత్ర దర్శకుడిగా ఎవరిని పెడదామా అనుకున్నపుడు విజయ్ ఆంటోనీ ఫోన్ చేసి.. తనతో సైతాన్ (తెలుగులో బేతాళుడు) సినిమా తీసిన ప్రదీప్ కృష్ణమూర్తిని తీసుకోమని సలహా ఇచ్చినట్లు సత్యరాజ్ వెల్లడించాడు. సత్య సినిమా చాలా బాగా వచ్చిందని.. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సత్యరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నెల 8న ‘సత్య’ తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని హిందీలో వశు భగ్నాని రీమేక్ చేయబోతున్నాడు.