Begin typing your search above and press return to search.

సర్కారు వారి పవర్ ఫుల్ థీమ్ తో కూడిన లవ్ స్టోరీ..!

By:  Tupaki Desk   |   18 April 2022 5:19 AM GMT
సర్కారు వారి పవర్ ఫుల్ థీమ్ తో కూడిన లవ్ స్టోరీ..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' 'భరత్ అనే నేను' 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్నారు. అయినప్పటికీ ఓ వర్గం ఫ్యాన్స్ ఈ సినిమాల సక్సెస్ తో సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళు మహేష్ నుంచి అంతకుమించిన బ్లాక్ బస్టర్ ని ఆశిస్తున్నారు.

చాలా కాలంగా ఒకే తరహా సినిమాలకు, సబ్టిల్ పాత్రలకు పరిమితమైన తమ అభిమాన హీరోని సరికొత్త అవతారంలో చూడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' సినిమా ఆ లోటుని పూరిస్తుందని భావిస్తున్నారు.

మహేష్ - కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోంది. మహేష్ డబ్బింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది.

సమ్మర్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా మే 12న SVP చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ బజ్ క్రియేట్ చేసింది.

సర్కారు వారి పాట ప్రచార చిత్రాలు - బ్లాస్టర్ టీజర్ లో మహేష్ మాసీ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఫ్రీ హెయిర్ స్టైల్ - మెడ మీద రూపాయి కాయిన్ తో వింటేజ్ మహేష్ కనిపించారు. అందుకే 'పోకిరి' వైబ్స్ ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ సైతం ఇదే ఫీల్ అవుతున్నారు.

బ్యాంకుల కుంభకోణాలు - ఆర్థిక నేరగాళ్ల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే 'సర్కారు వారి పాట' పవర్ ఫుల్ థీమ్ తో కూడిన లవ్ స్టోరీ అని తెలుస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్కువగా ప్రేమకథతో.. సెకండాఫ్ రియల్ స్టోరీతో ఉంటుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఇందులో మహేష్ కామెడీ టైమింగ్ ని పరశురామ్ చాలా బాగా ఉపయోగించుకున్నారని.. హీరో లుక్ తో పాటుగా డైలాగ్ డెలివరీ - మేనరిజం సరికొత్తగా ఉంటాయని అంటున్నారు. అలానే తొలిసారిగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న మహేష్ - కీర్తి జంట మధ్య లవ్ ట్రాక్ బాగా వచ్చిందని.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇక సర్కారు వారి పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. 'కళావతి' 'పెన్నీ' పాటలు రెండూ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా మేకర్స్ ప్రమోషన్స్ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 22న మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే 'మురారి బావ' అనే థర్డ్ సింగిల్ ని విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.