Begin typing your search above and press return to search.

సెలబ్స్‌ అందరూ లంకకే జంప్‌

By:  Tupaki Desk   |   10 Jun 2015 11:00 PM IST
సెలబ్స్‌ అందరూ లంకకే జంప్‌
X
అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం పనిగట్టుకుని ఎల్‌టీటీఈ మిలిటెంట్లను ఏరిపారేసింది. లీడర్‌ ప్ర భాకరన్‌ని లేపేసి అసలు పులుల భయమే లేకుండా చేసింది. అంతేకాదు ఇక ఎవరైనా ధైర్యంగా శ్రీలంకలో అడుగుపెట్టొచ్చు. ఇక్కడ బీచ్‌ స్నానాలు చేసుకోవచ్చు అంటూ రకరకాల ఆఫర్లు కూడా ప్రభుత్వం పెట్టింది. దాంతో లంకకు పర్యాటకుల తాకిడి పెరిగింది.

టాలీవుడ్‌ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు సైలెంటుగా శ్రీలంక వెళ్లి అక్కడ కొండ కోనల్లో స్వేచ్ఛగా తిరుగుతూ బీచ్‌ స్నానాల్లో సేదదీరుతూ ఇష్టానుసారం ఎంజాయ్‌ చేసి వస్తున్నారు. అప్పట్లో కోనవెంకట్‌, శ్రీనువైట్ల శ్రీలంకలోనే చెర్రీ కోసం కథ రాసుకున్నారు. ఈ ఇద్దరూ తిట్టుకుని కొట్టుకున్న వేడిని చల్లార్చుకుంది అక్కడే. లేటెస్టుగా అదే బాపతులో కన్నడ బ్యూటీ సంజన కూడా ఫ్యామిలీని తీసుకుని శ్రీలంక వెళ్లింది. అక్కడ చెల్లెళ్లతో కలిసి బీచ్‌ స్నానాలాడింది. ఈ విషయాన్ని సీక్రెట్‌గానే ఉంచింది అమ్మడు.

ఇక సంజూ టైపులోనే ఇప్పుడు అందరూ శ్రీలంక వెళుతున్నారు. మొన్నామధ్య కోన వెంకట్‌ కూడా కొలొంబోలో కూర్చొని రామ్‌చరణ్‌ సినిమా కథను, మాటలను రాసేసి తిరిగొచ్చాడు. చాలామంది చిన్నాచితకా సెలబ్స్‌ కూడా ఇప్పుడు మాట్లాడితే శ్రీలంకకే జంప్‌.